వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత ఎంబసీపై దాడికి యత్నం: పాక్ మద్దతుదారులపై యూకే ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

లండన్: భారత్‌కు బ్రిటన్ మరోసారి మద్దతు పలికింది. యూకేలోని భారత హైకమిషన్ కార్యాలయం ముందు పాకిస్థాన్ మద్దతుదారులు నిరసన చేపట్టి, దాడికి యత్నించడాన్ని బ్రిటీష్ విదేశాంగ కార్యదర్శి డామినిక్ రాబ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి కార్యక్రమాలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఉగ్రవాది ముద్ర: మరో ముగ్గురికీ అదే గుర్తింపుమాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై ఉగ్రవాది ముద్ర: మరో ముగ్గురికీ అదే గుర్తింపు

భారతీయులోపాటు ఏ ఇతర వర్గానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు చేస్తే సహించమని హెచ్చరించారు. మంగళవారం జరిగిన బ్రిటిష్ పార్లమెంటులో డామినిక్ రాబ్ మాట్లాడుతూ.. వర్గాల మధ్య ఘర్షణలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు.

Deplorable: UK Foreign Secretary On Violence Outside Indian Embassy

లండన్ మేయర్ సాదిక్ ఖాన్ కూడా పాక్ మద్దతుదారుల నిరసనను ఖండించారు. కాగా, మంగళవారం భారత హైకమిషన్ ఎదుట నిరసనకు దిగిన పాకిస్థాన్ మద్దతుదారుల్లో ఇద్దరిని యూకే పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని నిరసిస్తూ యూకేలోని భారత హై కమిషన్ కార్యాలయం వద్ద పాక్ మద్దతుదారులు మంగళవారం నిరసన చేపట్టారు. ఎంబసీపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వివరాలను భారత హై కమిషన్ కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

English summary
Two people have been arrested after violent protests led by British Pakistani groups outside the Indian High Commission in London on Tuesday. British Foreign Secretary Dominic Raab has condemned the violence, calling it "deplorable".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X