కూతుర్ని బలి పశువును చేశారు: దేవయాని తండ్రి
న్యూఢిల్లీ: అమెరికాలో భారత దౌత్య అధికారిగా విధులు నిర్వహిస్తున్న తన కూతురు దేవయాని కోబ్రాగాడెను బలి పశువును చేశారని, వెంటనే తన కూతురును భారతదేశానికి రప్పించాలని యూపిఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీని కోబ్రాగాడె తండ్రి ఉత్తమ్ కోబ్రాగాడె కోరారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ సమస్య కారణంగా తన కూతురు బలి పశువు అయిందని అన్నారు.
ఆమెను అరెస్ట్ చేసినప్పటికీ అమెరికా అధికారులు ఆమెతో గౌరవపూర్వకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కోబ్రాగాడె తండ్రి ఉత్తమ్ అన్నారు. సోనియా గాంధీ జోక్యం చేసుకుని వెంటనే తన కూతురును భారతదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తన కూతురు భద్రతా, స్వేచ్ఛా విషయమై భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ను కలవనున్నట్లు తెలిపారు.

తన సహాయకురాలి విషయంలో వీసా అవకతవకల ఆరోపణలతో దేవయానిపై కేసు నమోదు చేసిన యూఎస్ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఆమెకు సంకెళ్లు వేయడం, విచారణ సమయంలో దుస్తులు విప్పించి తనిఖీలు చేయడం, వ్యసనపరులు, హత్యానేరాలకు పాల్పడిన వారితోపాటు ఒకే గదిలో ఉంచడం లాంటి చర్యలపై భారత ప్రభుత్వం కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అంతేగాక భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న యూఎస్ దౌత్యవేత్తలను వారి గుర్తింపు కార్డులు తిరిగి ఇచ్చేయాల్సిందిగా ఆదేశించింది. భారత్ సందర్శనకు వచ్చిన యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధులతో భారత ప్రముఖులు సమావేశాలను కూడా తమ సమావేశాలను రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్, హోంమంత్రి షిండే, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నరేంద్ర మోడీ భారత పర్యటనలో ఉన్న అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులతో భేటీలను రద్దు చేసుకున్నారు.
-
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications