పాక్ ఆర్మీ చీఫ్గా షరీఫ్ రిటైర్మెంట్: చెప్పి మరీ అభిమాని ఆత్మహత్య
పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ రిటైర్మెంట్ను తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ రిటైర్మెంట్ను తట్టుకోలేక ఓ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం అతడి పదవీ కాలాన్ని పెంచకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన రహీల్ వీరాభిమాని లుత్ఫ్ అమిమ్ షిబ్లి(64) విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లుత్ఫ్ గతంలో కరాచీ పోర్ట్ ట్రస్ట్(కేటీపీ)లో ప్రోగ్రెసివ్ వర్కర్స్ యూనియన్కు చైర్మన్గా వ్యవహరించారు.
రహీల్ పదవీ కాలాన్ని పొడిగించకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ నవంబరు 1న కరాచీ ప్రెస్ క్లబ్(కేపీసీ) ఎదుట ఆందోళనకు దిగాడు. రహీల్ షరీఫ్ ఓ దూత అని, తాను అతడి అభిమానినని పేర్కొన్న లుత్ఫ్ ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించగలిగే దమ్ము ఆయనకు మాత్రమే ఉందని తెలిపాడు.

అయితే, నవంబరు 27న ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) రహీల్ రిటైర్మెంట్ను ప్రకటించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లుత్ఫ్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు ముందు లుత్ఫ్ తన భార్యకు రాసిన లేఖలో తన అంత్యక్రియల ప్రార్థనలు కరాచీ ప్రెస్క్లబ్ ఎదుట నిర్వహించాలని కోరడం గమనార్హం. లుత్ప్ మరణంతో ఆయన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
-
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!!












Click it and Unblock the Notifications