న్యూజిలాండ్ మసీదులపై దాడి : సోషల్ మీడియా ట్వీట్పై ట్రంప్ ఫైర్
Recommended Video
వాషింగ్టన్ : న్యూజిలాండ్ మసీదులపై దాడి చేసిన టారాంట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారనే ప్రచారం సోషల్ మీడియాలో జరిగింది. టారాంట్ ..ట్రంప్ లాగా ఉన్నారని ఒకరు ట్వీట్ కూడా చేశారు. ఆ ట్వీట్ను లక్షా 31 వేల మంది లైక్ చేయడం .. సోషల్ మీడియాలో ట్రోలవడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.
రియల్ ఎస్టేట్, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. మాటలే పెట్టుబడిగా కోటిన్నర మాయం
ట్రెండయిన ట్వీట్
క్రైస్ట్చర్చిలో కాల్పులు జరిపిన టారాంట్, శ్వేత జాతీయుడని .. అతడు ట్రంప్ మద్దతుదారుడని ట్వీట్ చేశారు. ఇది సోషల్ మీడియాలో తెగ ట్రైండ్ అయ్యింది. ఈ క్రమంలో ట్రంప్ స్పందిస్తూ .. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాన్ని తప్పుపట్టారు. మసీదులో ఉగ్రవాదులు దాడికి తెగబడితే .. అదీ తనకు ఆపాదిస్తారని మండిపడ్డారు. ఆ ట్వీట్ను లక్షా 31 వేల మంది లైక్ కూడా చేశారని పేర్కొన్నారు. ట్వీట్ చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
దాడిని ఖండిస్తున్నా : ట్రంప్
కాల్పులు జరిపిన టారాంట్ కూడా ట్రంప్ లాగే శ్వేత జాతీయుడిలా ఉండటంతో .. ఆయన అభిరుచి మేరకు నడుచుకొని కాల్పులు జరిపాడని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఒకరి అభిప్రాయాలను తనకు అనవసరంగా రుద్దారని ట్రంప్ పేర్కొన్నారు. మసీదు దాడిని తాను కూడా మానవతావాదిలా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
ఆల్ ఆర్ ఈక్వల్
ప్రపంచంలో తక్కువ ఉన్న మతాల పట్ల ట్రంప్కు సదాభిప్రాయం ఉన్నదని .. ఆయన ఎప్పుడూ వారిని తక్కువ చూడలేదని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి. 'న్యూజిలాండ్ దాడి తర్వాత, శ్వేత జాతియుడు చేసిన జాత్యాంహకార ఘటనను అందరికీ ఆపాదించడం సరికాదని‘ మిక్ ముల్వేనే తెలిపారు.