ప్రపంచంలో శక్తిమంతమైన మహిళ: సీఈవోలకు విందులో ఇంద్రానూయికి ట్రంప్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ కార్పోరేట్ కంపెనీల సీఈవోలకు, ప్రముఖులకు విందు ఇచ్చారు. న్యూజెర్సీలోని తన వ్యక్తిగత గోల్ఫ్ కోర్సులో ఏఱ్పాటు చేసిన విందుకు పెప్సికో నుంచి తప్పుకోనున్న సీఈవో ఇంద్రానూయి, మాస్కర్ కార్డ్స్ సీఈవో అజయ్ బంగా తదితరులు పాల్గొన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై దేశంలోని పలువురు కార్పోరేట్ ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రానూయిని ట్రంప్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ అని ట్రంప్ కొనియాడినట్లు వైట్ హౌస్ పేర్కొంది.

ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాల విషయంలో ముందుకు వెళ్లేందుకు పలువురు సీఈవోల అభిప్రాయాలను, వారి దృష్టికోణం, వారి ప్రాధాన్యతలు, ఆలోచనలు తెలుసుకునేందుకు ట్రంప్ ఈ విందు ఏర్పాటు చేశారని వైట్ హౌస్ తెలిపింది. ఈ విందుకు ఇంద్రానూయి తన భర్త రాజ్ నూయితో కలిసి హాజరైంది. అజయ్ బంగా తన సతీమణి రీతూ బంగాతో విందుకు వచ్చారు. పదిహేను మంది ప్రముఖ సీఈవోలు హాజరయ్యారని తెలుస్తోంది.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications