ఆస్పత్రిపై డ్రోన్ అటాక్.. 70 మంది మృతి
మిడిల్ ఈస్ట్ దేశమైన సూడాన్ లోని నార్త్ డర్ఫర్ రీజియన్ లోని ఎల్- ఫాషర్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) జరిపిన డ్రోన్ దాడిలో దాదాపు 70 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నట్లు సమాచారం. పదుల సంఖ్యలో రోగులు ఈ దాడిలో గాయపడినట్లు సమాచారం. ఈ దాడిని 'ఊచకోత'గా ఆ దేశ ఆరోగ్య శాఖ అభివర్ణించింది. ఈ ఘటన జరగడానికి వారం రోజుల ముందే ఆర్ఎస్ఎఫ్ బలగాలు సూడాన్ సైన్యాన్ని హెచ్చరించాయి. సూడాన్ లోని డర్ఫర్ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాయి. సూడాన్ ప్రభుత్వం, సైన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇలాంటి ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఇరు వర్గాల అధికారులు శాంతిని పాటించాలని.. సాధారణ ప్రజలను హింసిచడం తగదని హెచ్చరించింది. ఇప్పటికే ఎల్- పాషర్ ప్రజలు సర్వం కోల్పోయారని.. అలాంటి వారిపై డ్రోన్ దాడి చేయడమేంటని మండిపడింది. మరోవైపు డబ్ల్యూహెచ్ఓ కూడా ఈ ఘటనను తీవ్రంగా పరిగణించింది.

ఇలాంటి దాడులను ఖండిస్తున్నట్లు పేర్కొంది. వెంటనే దాడులు ఆపాలని ఆదేశించింది. ' ఎల్- పాషర్ లో ఉన్న ఒకే ఒక్క హాస్పిటల్ ఇది. దాన్ని కూడా పేల్చేశారు. సాధారణ రోగులతోపాటు, మా వైద్యులను కూడా చంపేశారు. ఇలాంటి ఘటనలు దారుణం' అని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. సూడాన్ లో మళ్లీ ఆరోగ్య సేవలను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
సూడాన్లో సైన్యానికి, పారామిలిటరీ దళమైన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్)కు మధ్య గతేడాది ఏప్రిల్ నుంచి అంతర్యుద్ధం జరుగుతోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఖార్టూమ్ దక్షిణ ప్రాంతమైన యార్మౌక్లో ఘర్షణలు జరుగుతున్నాయి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications