ఘోరం.. ఆస్పత్రిపై డ్రోన్ దాడి.. 64 మంది దుర్మరణం!
గత మూడేళ్లుగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఆఫ్రికా దేశం సూడాన్లో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది. పశ్చిమ సూడాన్లోని ఎల్-దాయెన్ నగరంలోని ఓ ఆస్పత్రిపై జరిగిన డ్రోన్ దాడిలో 13 మంది పిల్లలు, ఇద్దరు నర్సులు, ఓ డాక్టరు సహా మొత్తం 64 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ఈస్ట్ దార్పప్ ప్రావిన్స్ రాజధాని అయిన ఎల్-దాయెన్ నగరంలో శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది. ప్రస్తుతం ఈ నగరం పారామిలిటరీ దళాలైన రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) ఆధీనంలో ఉంది. ఈ దాడిలో ఆస్పత్రి పై అంతస్తు పూర్తిగా ధ్వంసం కాగా.. ఎమర్జెన్సీ వార్డుతో పాటు కీలకమైన వైద్య పరికరాలు కాలి బూడిదయ్యాయి. దీనివల్ల వేలాది మందికి వైద్యం అందించే ఈ కీలక ఆస్పత్రి ప్రస్తుతం పనిచేయలేని స్థితికి చేరుకుంది. ఈ దాడికి సూడాన్ సైన్యమే కారణమని ఆర్ఎస్ఎఫ్ ఆరోపిస్తోంది. అయితే తాము అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తామని.. ఈ దాడితో తమకు సంబంధం లేదని సూడాన్ సైన్యం స్పష్టం చేసింది.

డబ్ల్యూహెచ్వో ఆవేదన
ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు టెడ్రోస్ అధనామ్ గాబ్రేయేసస్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "ఇకనైనా ఈ రక్తపాతం ఆగాలి. శాంతియే అన్నింటికంటే గొప్పమందు. ఆరోగ్య కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ఆపాలి." అని ఆయన ఎక్స్(ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు. సూడాన్ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 213 దాడుల్లో దాదాపు 2,036 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధ్రువీకరించింది.
సూడాన్ అతలాకుతలం
2023 ఏప్రిల్ లో సూడాన్ ఆర్మీ, ఆర్ఎస్ఎఫ్ మధ్య మొదలైన అధికార పోరాటం ప్రపంచంలోనే అతిపెద్ద సంక్షోభానికి దారితీసింది. ఇప్పటివరకు 1.5 లక్షల మందికి పైగా ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 1.2 కోట్ల మంది తమ ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకు శరణార్ధులుగా వెళ్లిపోయారు. అంటే దేశ జనాభాలో మూడో వంతు వలస వెళ్లారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications