ఇండోనేషియాలో భూకంపం: 7.3 తీవ్రత నమోదు -స్థానికులు హై అలర్ట్..!!
ఇండోనేషియాలో భూకంపం వణికించింది. 7.3 తీవ్రతతో నమోదైన భూపకంతతో ద్వీపాలు వణికిపోయాయి. స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో..స్థానికంగా హైఅలర్ట్ ప్రకటించారు. లాస్పాలోస్, మునిసిపియో డి లౌటెమ్, తైమూర్-లెస్టెకి ఈశాన్యంగా 113 కిలోమీటర్ల దూరంలో ఉన్న కెపులావాన్ బరాత్ దయాలో అత్యంత బలమైన భూకంపం సంభవించింది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, ఇది స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.25 గంటలకు సంభవించింది.
భూకంపం ప్రభావం ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ రాజధాని డార్విన్లో 600 కిలోమీటర్ల దూరంలో ఉంది.భూకంపం ప్రభావం ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ రాజధాని డార్విన్లో 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లుగా గుర్తించారు. భూకంపం ధాటికి కానీ అది అల్మారాలు మరియు విరిగిన కిటికీల నుండి పడే వస్తువులు కదలినాయి. కానీ, భారీగా నష్టం వాటిల్లినట్లు ఎక్కడా రిపోర్టు కాలేదు. 17,200 జనాభా, బౌకావు (16,000 జనాభా) 160కిమీ, వెనిలాలే (16,000 జనాభా) 176కిమీల దూరంలో ఉన్న లాస్పాలోస్లో అగ్నిపర్వతం వద్ద ఇది చోటు చేసుకున్నట్లుగా గుర్తించారు.

భూకంప తీవ్రత 7.5గా నమోదు చేయబడిందని జియోసైన్స్ ఆస్ట్రేలియా (జియోఎయు) తరువాత విడుదలచేసిన సెకండ్ రిపోర్టులో వెల్లడించింది. అదే భూకంపాన్ని నివేదించిన ఇతర ఏజెన్సీలలో ఫ్రాన్స్కు చెందిన రిసో నేషనల్ డి సర్వైలెన్స్ సిస్మిక్ తీవ్రత 7.0గా గుర్తించగా...జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) 7.2 తీవ్రత ఉన్నట్లు వెల్లించాయి. 2018 లో సులవేసి భూకంపం కారణంగా దాదాపు నాలుగు వేల మందికి పైగా మరణించారు. ఇండోనేషియాలో ఎన్నో భూకంపాల చరిత్ర ఉంది.












Click it and Unblock the Notifications