జావాను తాకిన పెను భూకంపం: ఇద్దరు మృతి
జకార్తా: ఇండోనేషియాను బలమైన భూకంపం తాకింది. రద్దీగా ఉండే జావాలో శుక్రవారం రాత్రి భూకంపం వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. భూకంపం తీవ్ర రెక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది.
శుక్రవారం రాత్రి 11.47 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చింది. జావా ద్వీపమంతా దాని ప్రభావం కనిపించింది. దాదావు 200 కీలోమీటర్ల మేర అది ప్రభావం చూపింది. దాదావు 30 సెకన్ల పాటు భూమి కంపించింది.
భయాందోళనలతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. రోడ్లపై విపరీతమైన రద్దీ చోటు చేసుకున్న దృశ్యాలను ఇండోనేషియా టెలివిజన్లు ప్రసారం చేశాయి. భవనం కూలడంతో 62 ఏళ్లు పురుషుడు, 80 ఏళ్ల మహిళ మరణించారు.
తాసిక్మలయ, పంగందరన్, సియామిస్ ప్రాంతాల్లో భూకంపం ప్రభావం తీవ్రత ఎక్కువగా కనిపించింది. ఈ ప్రాంతాలు వెస్టే జావా ప్రావిన్స్లో ఉన్నాయి. దాదాపు 4 ఇళ్లు ధ్వంసమైనట్లు సమాచారం. 65 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.