హెచ్చరిక: యూరప్లో 5వేలమంది ఉగ్రవాదులు
లండన్: ఉగ్రవాదులు మరోసారి ఐరోపా దేశాల్లో విధ్వంసాన్ని సృష్టించే కుట్రకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సుమారు 5వేల మంది భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ముష్కరులు ఐరోపా దేశాల్లో నక్కి ఉండొచ్చని ఐరోపా సమాఖ్య పోలీస్ విభాగం అధినేత రాబ్ వెయిన్రైట్ హెచ్చరించారు.
సిరియా, ఇతర దేశాల్లోని ఉగ్ర శిబిరాల్లో శిక్షణ పొంది, ఐరోపాకు తిరిగివచ్చిన వారి వల్ల పెద్దముప్పు పొంచివుందని ఆయన అప్రమత్తం చేశారు. పారిస్ దాడుల కంటే తీవ్రమైన నరమేధాలకు వారు ప్రణాళికలు రచిస్తూ ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, శరణార్థుల ముసుగులో ఉగ్రవాదులు ఐరోపాలోకి ప్రవేశిస్తున్నారన్న వాదనను ఆయన కొట్టిపారేశారు. కాగా, ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో రెండు సార్లు దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇప్పుడు మరిన్ని ఐరాపా దేశాల్లో దాడులకు పాల్పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications