బలూచిస్తాన్ లో పేలుళ్లు: ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు
క్వెట్టా: బలూచిస్తాన్ లోని క్వెట్టా ప్రాంతంలో ఉన్న మడాద్గర్ సెంటర్ వద్ద గురువారం సాయంత్రం భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. చమన్ హౌజింగ్ సొసైటీ సమీపంలో మూడు పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.
బలూచిస్తాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బగ్తీ పేలుళ్లను ధ్రువీకరించారు. సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నట్టు తెలిపారు.

కాగా, అంతకుముందు గురువారం తెల్లవారుజామున బలూచిస్తాన్ భద్రతా దళాలు కిల్లీ అల్మాస్ ప్రాంతంలో లష్కరే జాంగ్వీ చీఫ్ ను మట్టుబెట్టాయి. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ సోహైల్ ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఇంటలిజెన్స్ సమాచారంతో భద్రతా దళాలు ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications