అమ్మాయిల కిడ్నాప్లు, మతమార్పిళ్లు: పాక్లో భారీగా తగ్గిన హిందువులు, దయనీయం
పాకిస్థాన్ దేశంలో హిందువుల పరిస్థితి రోజు రోజుకు మరీ దయనీయంగా మారుతోంది. బలవంతంపు మతమార్పిడిలు జోరుగా సాగుతుండటంతో హిందువుల సంఖ్య భారీగా పడిపోయింది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ దేశంలో హిందువుల పరిస్థితి రోజు రోజుకు మరీ దయనీయంగా మారుతోంది. బలవంతంపు మతమార్పిడిలు జోరుగా సాగుతుండటంతో హిందువుల సంఖ్య భారీగా పడిపోయింది. 1947లో ఆ దేశంలో హిందువులు 23శాతం ఉండేవారు. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య 6శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశమే.

కిడ్నాపులు, మతమార్పిళ్లు..
బలవంతంపు మతమార్పిడులు, అణిచివేత వల్లే ఈ ఇస్లామిక్ దేశంలో మిగితా మతాలకు ఆదరణ కరువైనట్లు తెలుస్తోంది. మైనార్టీలుగా ఉన్న హిందూ అమ్మాయిలను బలవంతంగా ఎత్తుకెళ్లి.. ముస్లింలుగా మత మార్పడి చేసి, పెళ్లి చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి తాజాగా ద నేషన్ అనే పత్రిక ఓ వ్యాసంలో ఈ అంశాన్ని స్పష్టం చేసింది.

హిందువులే టార్గెట్..
బలవంతపు మతమార్పిడుల వల్లే ఒకప్పుడు మెజారిటీగా ఉన్న హిందువులు ఇప్పుడు మైనార్టీలుగా మారినట్లు వెల్లడించింది. పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సులో అత్యధిక శాతం హిందువులు ఉన్నారు. కానీ, ఇప్పుడు అక్కడ ఎక్కువ శాతం నేరాలు చోటు చేసుకుంటున్నాయి. మైనార్టీలైన హిందువులను టార్గెట్ చేస్తూ నేరాలు కొనసాగుతున్నాయి.

మతం మార్చేస్తున్నారు..
ముఖ్యంగా హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మతమార్పిడి చేస్తున్నారు. తక్కువ కులానికి చెందిన హిందువులను మత మార్పిడులకు ప్రోత్సహిస్తూ, పెద్ద కులానికి చెందిన హిందూ అమ్మాయిలను ఎక్కువగా కిడ్నాప్ చేసి మతమార్పిడులకు పాల్పడుతున్నారు.

భారత్ వైపే వారి చూపు..
మూవ్మెంట్ ఫర్ సాలిడారిటీ అండ్ పీస్ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం.. ప్రతి ఏడాది సుమారు వెయ్యి మంది ముస్లిమేతర అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చేస్తున్నారు. దీంతో పాకిస్థాన్లో ఉన్న హిందువులు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడి హిందువులు భారతదేశంలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం.
-
పాకిస్తాన్ ఘాతుకంపై రషీద్ ఖాన్ షాక్ -
పాకిస్తాన్ అనాగరిక దాడి- తీవ్రంగా స్పందించిన భారత్..! -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..?












Click it and Unblock the Notifications