పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నాసిరుల్ ముల్క్
కరాచీ: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ నాసిరుల్ ముల్క్ను నియమించారు. ఈ మేరకు ప్రధాని ప్రకటించారు. జూలై 25వ తేదీన పాకిస్తాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని షాహిద్ అబ్బాసీ ఆపద్ధర్మ ప్రధానిని నియమించారు.
నాసిరుల్ను నియమించినట్లు ప్రకటన చేశారు. ఆపద్ధర్మ ప్రధానమంత్రి అంశంపై కొద్ది రోజులుగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఈ మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చకముందే రాజకీయాలతో సంబంధం లేని రిటైర్డ్ జడ్జిని నియమించారు.

గురువారం నాటితో అబ్బాసీ పదవీకాలం ముగియనంది. అప్పటి నుంచి ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నాసిరుల్ ముల్క్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగుతారని తెలిపారు.












Click it and Unblock the Notifications