దారుణం: భార్యకు నిప్పంటించి హత్య చేసిన ‘గే’ భర్త
పోలీసులక కథనం ప్రకరాం.. గే అయిన నిందితుడు జస్విర్ రామ్ గిండే ఓ బ్యాంకులో విధులు నిర్వహిస్తున్నాడు. అతడు 2013 మార్చిలో 24ఏళ్ల రాణి అనే యువతిని వివాహం చేసుకుని బ్రిటన్కు వచ్చాడు. బ్రిటన్లోని వెస్ట్ మిడ్లాండ్స్లో నివాసం ఉంటున్నాడు. కాగా, గిండేకు 2008 నుంచే ఇతర పురుషులతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తన భార్య రాణిని చిత్ర హింసలకు గురి చేస్తూ.. గత సెప్టెంబర్ 12న పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. తన ఇంటి ఆవరణలోని మృతదేహాన్ని పారేసి చెత్తాచెదారంతో కప్పేశాడు.
ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ ప్రారంభించిన పోలీసులు అతని ఇంటి వద్ద కాలిపోయి పడివున్న బాధితురాలి మృతదేహాన్ని గుర్తించి గిండేను విచారించారు. అనంతరం నిందితుడు గిండే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిండేనే హత్య చేశాడని నిర్ధారించిన పోలీసులు అతన్ని కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
న్యాయవాదుల వాదనలను విన్న కోర్టు గిండే తన భార్యను హత్య చేశాడని నిర్ధారించింది. అయితే తాను హత్య చేయలేదని, పోలీసుల అబద్ధాలు చెబుతున్నారని నిందితుడు గిండే ఆరోపించాడు. కాగా, పూర్తి విచారణ తర్వాత నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. తమ అల్లుడు స్వలింగ సంపర్కుడన్న విషయం తమకు తెలియదని, తెలిసి ఉంటే తమ కూతుర్ని అతనికిచ్చి వివాహం చేసేవారిమి కాదని బాధితురాలు రాణి తండ్రి వాపోయారు.