అదే జరిగితే ప్రపంచానికి పెనుముప్పే: తాజా అధ్యయంలో వెల్లడైన నిజాలు!
యూకెలోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం దీనిపై పరిశోధనలు చేపట్టింది.
లండన్: భవిష్యత్తు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టంలో గణనీయమైన మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న మట్టం నుంచి మరో మూడు మీటర్ల వరకు సముద్ర మట్టం పెరగవచ్చునని తాజా పరిశోధనలో వెల్లడైంది.
యూకెలోని సౌతాంప్టన్ యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ పరిశోధన బృందం దీనిపై పరిశోధనలు చేపట్టింది. అంటార్కిటా ప్రస్తుతం కోల్పోతున్న ద్రవ్యరాశి, నూతన గణాంక పద్దతి ప్రకారం 2100సంవత్సరం నాటికి సముద్ర మట్టాలు మూడు మీటర్ల వరకు పెరిగే అవకాశముందని సౌతాంప్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సైబ్రేన్ తెలిపారు.

ఇప్పటివరకు కేవలం అర మీటరు వరకు సముద్ర మట్టం పెరుగుతుందని పరిశోధకులు భావించగా.. అందుకు భిన్నంగా ఇప్పుడు మూడు మీటర్లు మేర పెరుగుతుందని తేలడం గమనార్హం.
ఇప్పటిలాగే సముద్ర మట్టం పెరిగిన తర్వాత కూడా కార్బన్ డై యాక్సైడ్ ఉద్గారాలు వెలువడితే.. ఆ నష్టాలను అంచనా వేయడం కష్టమని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు, దీనివల్ల కొన్ని శతాబ్దాల్లోనే లోతట్టు నదీ డెల్టాల్లో ఏర్పడ్డ మహానగరాలన్ని ముంపుకు గురవుతాయని వారు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications