గూగుల్ టాప్ క్రిమినల్ లిస్టులో మోడీ: నోటీసులు
అలహాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని గూగుల్ అవమానపరిచింది. టాప్-10 క్రిమినల్స్ జాబితా ఇదేనంటూ.. అందులో మోడీ పేరును పేర్కొంటూ ఫోటోను ఉంచింది. దీనిపై తీవ్రంగా స్పందించిన న్యాయవాది సుశీల్ కుమార్ మిశ్రా మోడీ పేరును తీసేయాలని గూగుల్ను కోరారు.
గూగుల్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో చివరకు అలహాబాద్ కోర్టును ఆశ్రయించారు మిశ్రా. అలహాబాద్ కోర్టులో గూగుల్ సంస్థ నిర్వాకంపై పిటిషన్ దాఖలు చేశారు. మోడీని క్రిమినల్స్ జాబితాలో పేర్కొన్న గూగుల్పై కేసు నమోదు చేయాలని పిటిషన్లో కోరారు.
ఈ కేసును విచారించిన కోర్టు 2015, నవంబర్ 3న పిటిషన్ను కొట్టివేసింది. దీంతో కోర్టులో గూగుల్పై రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు గూగుల్ సంస్థతో పాటు సీఈవో, ఆ సంస్థ ఇండియా ప్రతినిధిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు చేయడమే కాకుండా నోటీసులు కూడా జారీ చేసింది.