విమానంపై ఉగ్రవాదుల కాల్పులు: ఒకరు మృతి

ఈ సంఘటనలో ఒక మహిళా ప్రయాణికురాలు మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. అధికారులు మాత్రం కాల్పుల్లో ఎవరూ చనిపోలేదని, ఇద్దరు ప్రయాణికులు క్షతగాత్రులయ్యారని తెలిపారు. విమానంలో 178 మంది ప్రయాణికులు ఉన్నారని, విమానం దిగుతుండగా సమీపంలోని నివాస ప్రాంతం నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, పిఐఎ అధికార ప్రతినిధి చెప్పారు.
ఇది ఉగ్రవాదుల పనేనా, విమానాన్ని లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిపారా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని చెప్పారు. ఈ ప్రాంతంలో అకారణంగా గాలిలోకి కాల్పులు జరపడం సహజమని పీఐఏ అధికార ప్రతినిధి తెలిపారు.
ఈనెల 8వ తేదీన 10 మంది ఉగ్రవాదులు కరాచీ విమానాశ్రయాన్ని ముట్టడించి 29 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఆ తర్వాత అన్ని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేసినా పెషావర్లో మరోమారు కాల్పులు జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications