18 మందిని కాల్చి చంపేసిన గ్యాంగ్ స్టర్స్
బ్రెజిల్: దుండగుల జరిపిన కాల్పులలో 18 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పలువురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఆరు మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు.
బ్రెజిల్ లోని సావోపో నగరంలోని బారౌరీ ప్రాంతంలోకి శుక్రవారం రాత్రి ముసుగులు వేసుకున్న కొందరు దుండగులు ఒక వాహనంలో వెళ్లారు. తరువాత అక్కడ ఉన్న వారి వివరాలు అడిగారు. ఆ పరిసర ప్రాంతాలలో వరుసగా కాల్పులు జరిపారు.
ఆ సందర్బంలో బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో పలువురు అక్కడే ప్రాణాలు వదిలిపెట్టారు. తరువాత సమీపంలోని బార్ లోకి వెళ్లి అక్కడ కాల్పులు జరిపారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు వచ్చేలోపు దుండగులు అక్కడి నుండి పరారైనారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యక్షసాక్షుల నుండి వివరాలు తెలుసుకున్నామని పోలీసులు తెలిపారు.
అత్యున్నత స్థాయి పోలీసు అధికారులతో దర్యాప్తు చేయిస్తున్నారు. అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే గ్యాంగ్ లు వారి ఆధిపత్యం కోసం అప్పుడప్పుడు ఈ విధంగా కాల్పులు జరుపుతుంటారని స్థానిక మీడియా వెల్లడించింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications