Viral Video:ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించిన ఆ అమెరికన్ సింగర్ ఎవరు..?
ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది.ఓ వైపు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మరో వైపు అతిపురాతన ప్రజాస్వామ్య దేశాలు ఒకే వేదికపైకి రావడంతో ప్రపంచ దేశాలు ఈ స్నేహబంధాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఇక మోదీ మేనియా అమెరికాలో మామూలుగా లేదు. ప్రధాని మోదీ అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశం సందర్భంగా కొన్ని అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేశాయి.
అమెరికా కాంగ్రెస్ సమావేశంలో మోదీ ప్రసంగం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మోదీ మాట్లాడిన ప్రతి మాటకు సభలోని సభ్యులు చప్పట్లు కొట్టారు. మోదీ ప్రసంగం తర్వాత అమెరికా ప్రజాప్రతినిధులు ఆయనతో ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడిన విషయం తెలిసిందే. ఇక ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా చివరి రోజున జరిగిన కార్యక్రమంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది.

అమెరికాకు చెందిన గాయని మేరీ మిల్బెన్ ప్రధాని మోదీకి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. భారతదేశం జాతీయ గీతం జనగణమన ఆలపించిన అనంతరం మేరీ మిల్బెన్ నేరుగా ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది.ఈ అద్భుత దృశ్యానికి వాషింగ్టన్లోని రోనాల్డ్ రీగన్ బిల్డింగ్ మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ వేదికగా నిలిచింది.
After singing India's National Anthem, renowned American singer Mary Millben touched Prime Minister Shri @narendramodi Ji's feet as per Indian traditions.
— Col Rajyavardhan Rathore (@Ra_THORe) June 24, 2023
From Papua New Guinea in the East to the United States in the West, Prime Minister Modi is a charismatic leader who commands… https://t.co/a7h4CByS6q pic.twitter.com/wMRjWjLRZL
ఆఫ్రికన్- అమెరికన్ హాలీవుడ్ నటి మరియు గాయని మేరీ మిల్బెన్ భారత్కు చెందిన జాతీయగీతం జనగణమన, ఓమ్ జై జగదీశ్ హరే పాటలు పాడటం ద్వారా లైమ్లైట్లోకి వచ్చింది. ప్రధాని మోదీ ముందు భారత జాతీయ గీతం ఆలపించడం తన పూర్వ జన్మ సుకృతమని కార్యక్రమానికి ముందు మిల్బెన్ అన్నారు. ఇప్పటి వరకు నలుగురు అమెరికా అధ్యక్షుల ముందు అమెరికా జాతీయగీతం పాడే అవకాశం దక్కిందని చెప్పిన మిల్బెన్... ప్రధాని మోదీ ముందు తన కుటుంబంగా భావించే అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల ముందు ప్రదర్శన ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు.
అమెరికా-భారత్ రెండు దేశాలు ప్రజాస్వామ్యం, స్వేచ్ఛను గురించి మాట్లాడతాయని అందుకే ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ బలపడుతున్నాయని మిల్బెన్ చెప్పుకొచ్చారు.స్వేఛ్చాయుత దేశంకు నిర్వచనం అక్కడ స్వేఛ్ఛగా జీవించే ప్రజలే అని అన్నారు.
“I will rest in the end, knowing that anything I did of great significance is because He (God) did it through me.”
— Mary Millben (@MaryMillben) June 23, 2023
Tonight as I perform the Indian National Anthem for Prime Minister @narendramodi and distinguished guests, India and Indian communities across the world, you are… pic.twitter.com/RXMVfLsCQg
ఇక ప్రధాని మోదీ గత నెలలో పాపువా న్యూగినియాలో పర్యటించిన సమయంలో ఆ దేశ ప్రధాని మోదీ పాదాలకు నమస్కరించారు. పాపువా న్యూగినియా పర్యటన ముగిసిన అనంతరం ఆ దేశ ప్రధాని విమానాశ్రయంలో మోదీ పాదాలకు నమస్కరించగా తిరిగి మోదీ రెండు చేతులు జోడించి వారికి నమస్కరించారు. ఆ సమయంలో ఇటు జాతీయ పత్రికలు అటు అంతర్జాతీయ పత్రికలు ప్రధాన శీర్షికతో కథనాలను ప్రచురించాయి.
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications