అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..!
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న యుద్ధ వాతావరణం మధ్యప్రాచ్య దేశాలను వణికిస్తోంది. ఈ ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరిన తరుణంలో హిజ్బుల్లా చీఫ్ షేక్ నయీమ్ ఖాసిం చేసిన హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తమ లెబనీస్ ఉద్యమం శత్రువుల ముందు మోకరిల్లదని.. మడమ తిప్పకుండా పోరాడుతుందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధం ఎంత భీకరంగా ఉన్నా.. తమ లక్ష్యం నుంచి వెనక్కి తగ్గబోమని.. అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమే కానీ లొంగిపోయే ప్రసక్తే లేదని హిజ్బుల్లా చీఫ్ నయీమ్ ఖాసిం ప్రకటించారు.
గౌరవం, మనుగడ కోసం పోరాటం
బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో నయీమ్ ఖాసిం లెబనాన్ ప్రస్తుత పరిస్థితిని విశ్లేషించారు. లెబనాన్ ఇప్పుడు ఓ చారిత్రాత్మక మలుపులో నిలబడి ఉందని.. దేశం ముందు ఇప్పుడు రెండు మార్గాలు మాత్రమే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మొదటిది భూమిని, ఆత్మగౌరవాన్ని, రాబోయే తరాల భవిష్యత్తును శత్రువుకు ధారపోసి బానిసలుగా లొంగిపోవడం.. రెండోది కష్టనష్టాలకు ఓర్చి శత్రువును వీరోచితంగా ఎదుర్కోవడమని ఆయన స్పష్టం చేశారు. తాము రెండో మార్గాన్నే ఎంచుకున్నామని.. గౌరవం లేని జీవితం కంటే పోరాటమే మిన్న అని ఆయన అన్నారు. ఈ యుద్దం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని.. ఇది తమ ఉనికి, ప్రాంతీయ సమగ్రతకు సంబంధించిన మనుగడ పోరాటమని ఆయన అభివర్ణించారు.

ఇజ్రాయెల్ ఎత్తుగడలను చిత్తు చేస్తాం..
ఇజ్రాయెల్, దాని మిత్రదేశాల వ్యూహాలను హిజ్బుల్లా దళాలు సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయని నయీమ్ ఖాసిం తెలిపారు. తమ పోరాట పటిమ కారణంగానే ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో భారీ అడుగు వేయలేకపోయిందని ఆయన గుర్తు చేశారు. తమ సైనికులు ప్రదర్శిస్తున్న ధైర్యసాహసాలు, దేశభక్తి దేశానికే గర్వకారణమని ఆయన కొనియాడారు. కేవలం యుద్ధ వీరులనే కాకుండా.. ఈ దాడుల వల్ల ఇళ్లు కోల్పోయి రోడ్డున పడినా.. దేశం కోసం దృఢంగా నిలబడుతున్న సాధారణ ప్రజల సహనాన్ని, త్యాగాన్ని కూడా హిజ్బుల్లా చీప్ ప్రత్యేకంగా అభినందించారు.
శాంతి చర్చల మధ్యే పెరుగుతున్న ఉద్రిక్తతలు
మరోవైపు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య తెరవెనుక శాంతి ఒప్పందాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు ద్వయం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు మంటలకు ఆజ్యం పోస్తున్నాయి. హిజ్బుల్లా వంటి సాయుధ సంస్థలు చేస్తున్న ఇటువంటి ప్రకటనలు శాంతి ప్రయత్నాలకు ప్రతిబంధకంగా మారుతున్నాయి. హిజ్బుల్లా చీఫ్ నయీం ఖాసి చేసిన కామెంట్ల నేపథ్యంలో మధ్యప్రాచ్యంలో పూర్తిస్థాయి యుద్ధం మొదలవుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
-
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
తాడో పేడో: యుద్ధం ఆపే ప్రసక్తే లేదు- ట్రంప్ కు నెతన్యాహు అర్జంట్ ఫోన్ కాల్ -
ప్రధాని మోదీకి పాకిస్థాన్ సడెన్ షాక్ ..?? -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
చేతులెత్తేసిన ట్రంప్.. ప్రధాని మోదీకి ఫోన్.. -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఖమేనీ సంధి ఒప్పందం? -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ?












Click it and Unblock the Notifications