రంగంలోకి వాయుసేన: ఐఏఎఫ్ సీ-17 సేవలు, రొమెనియా నుంచి తరలింపు
రష్యా ఉక్రెయిన్ యుద్దం వల్ల సిచుయేషన్ దారుణంగా ఉంది. దీంతో ఉక్రెయిన్లో ఉన్న పౌరులను తీసుకొచ్చే ప్రయత్నాలను ఆయా దేశాలు చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్ గగనతలం మూసివేయడంతో.. పొరుగున ఉన్న రొమోనియా.. ఇతర దేశాల గుండా జనం స్వదేశం చేరుకుంటున్నారు. ఇండియా కూడా ఆపరేషన్ గంగా చేపట్టింది. ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశం తీసుకొస్తోంది. అయితే ఇవాళ నవీన్ అనే భారతీయుడు మరణంతో ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఉన్న మిగతా వారిని యుద్దప్రాతిపదికన తీసుకురావాలని భారత్ అనుకుంటుంది.
Recommended Video

రష్యాతో యుద్ధం కారణంగా భీతావహ పరిస్థితులు నెలకొన్న ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ శాఖ మంత్రి, ఆ శాఖ అధికారులతో భేటీలు నిర్వహించారు. తాజాగా మంగళవారం సాయంత్రం కూడా మరో దఫా బేటీ అయ్యారు. భారత రక్షణ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు వాయు సేనను రంగంలోకి దించాలని ప్రధాని ఆదేశించారు. వాయుసేనకు చెందిన సీ-17 విమానాల ద్వారా త్వరితగతిన ఉక్రెయిన్లోని భారతీయులను దేశానికి తరలించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే రంగంలోకి దిగిపోయింది. విదేశాంగ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఉక్రెయిన్లోని భారతీయులను స్వదేశానికి తరలించేందుకు సీ-17 విమానాలను ఉక్రెయిన్ పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులను అక్కడి నుంచి తరలించేందుకు సహకరించాలని అటు ఉక్రెయిన్తో పాటు ఇటు రష్యాను కోరాలని విదేశాంగ శాఖకు మోడీ ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా ఇప్పటికే ఆ రెండు దేశాలతో విదేశాంగ శాఖ చర్చలు ప్రారంభించింది. ఉక్రెయిన్లోని భారతీయుల కోసం సీ-17 విమానాలు ఏ క్షణంలో అయినా టేకాఫ్ తీసుకునేందుకు రంగం సిద్ధమైపోయింది.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications