కరోనా వైరస్ వ్యాప్తి తగ్గింది కానీ..: చైనాలో పరిస్థితిపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
న్యూయార్క్: చైనా, అమెరికాతోపాటు పలు దేశాల్లో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తంచేసింది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి మూలాల గురించిన వివరాలు అందజేయాలని చైనాకు చాలా సార్లు విన్నవించామని తెలిపింది.
'ప్రస్తుత పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడానికి, డబ్ల్యూహెచ్ఓకి వ్యాధి తీవ్రత, ఆసుపత్రిలో చేరడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మద్దతు కోసం అవసరాలపై మరింత వివరణాత్మక సమాచారం అవసరం. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రమాదంలో ఉన్న వ్యక్తులకు టీకాలు వేయడంపై దృష్టి సారించడానికి డబ్ల్యూహెచ్ఓ చైనాకు మద్దతు ఇస్తోంది. మేము క్లినికల్ కేర్, దాని ఆరోగ్య వ్యవస్థను రక్షించడానికి మా మద్దతును అందిస్తూనే ఉన్నాం' అని టెడ్రోస్ తెలిపారు.

కోవిడ్-19 మహమ్మారి ఈ సంవత్సరం గణనీయంగా తగ్గింది, గ్లోబల్ మంకీపాక్స్ వ్యాప్తి క్షీణిస్తోంది. మూడు వారాల కంటే ఎక్కువ ఎబోలా కేసులు లేవు అని టెడ్రోస్ వెల్లడించారు. ఈ అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కటి ప్రకటించబడుతుందని తాము ఆశిస్తున్నామని చెప్పారు. చైనా కోవిడ్ వ్యాప్తిపై సరైన వివరాలు అందజేయాలని మరోసారి కోరారు.
"ఖచ్చితంగా, మేము కోవిడ్ -19 మహమ్మారితో గత ఒక సంవత్సరం క్రితం కంటే మెరుగైన స్థానంలో ఉన్నాము, మేము ఓమిక్రాన్ వేవ్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, వేగంగా పెరుగుతున్న కేసులు, సంభవించాయని తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు, మరణాలు భారీగా తగ్గినప్పటికీ.. చైనా సహా కొన్ని దేశాల్లో కరోనా ఉధృతిపై అన్ని దేశాలు అప్రమత్తంగా ఉండాలని గెబ్రేయేసస్ హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. కొత్త వైరస్ వ్యాప్తిలను అడ్డుకునేందుకు సీక్వెన్సింగ్ పరీక్షలు త్వరితగతిన చేయాలని సూచించారు. ఏ దేశం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించి మరిన్ని మరణాలకు కారణం కావద్దని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications