భారత్ ఉగ్రవాద బాధిత దేశమే పరోక్షంగా పాక్ ప్రస్తావన
భారత్ కూడ ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అరబ్ ఇస్లామిక్ -యూఎస్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రియాద్: భారత్ కూడ ఉగ్రవాద బాధిత దేశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అరబ్ ఇస్లామిక్ -యూఎస్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తరచూ భారత్ ఉగ్రవాదుల దాడులకు గురౌతున్న విషయాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు.
పశ్చిమఆసియా దేశాలతో ఉగ్రవాద నిర్మూలనకు కలిసిపనిచేస్తామని ట్రంప్ హమీ ఇచ్చాడు. ఏ దేశం కూడ ఉగ్రవాద గ్రూపులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన కోరారు.
అమెరికా నుండి ఇండియావరకు అస్ట్రేలియానుండి రష్యావరకు ఉగ్రవాదదాడులకు గురౌతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అంతేకాదు ఏ దేశం కూడ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించకూడదని ఆయన కోరారు. అయితే ఈ విషయంలో పాకిస్తాన్ పేరును ప్రస్తావించకుండానే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మరో వైపు ఇది చెడుకు మంచికి మద్య యుద్దమని ట్రంప్ చెప్పారు. కాని, విశ్వాసాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం కాదని ఆయన చెప్పుకొచ్చారు.