భారత్ జపాన్ బంధం ధృడమైంది.. ఉమ్మడి సంకల్పంతో కూడింది: మోడీ
ప్రధాని మోడీ రెండురోజుల జపాన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. క్వాడ్ సదస్సులో పాల్గొననున్నారు. సోమవారం టోక్యోలో గల ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జరుపుకుంటుంది అని చెప్పారు. 100వ ఇండిపెండెన్స్ డే వేడుకలకు అడుగులు వేస్తుందని చెప్పారు. మరో 25 ఏళ్లలో దేశం మరింత ఉన్నత స్థితికి చేరుకోగలదని ఆకాంక్షించారు.

ఆజాదీ కా అమృత్ దేశ శ్రేయస్సు, విజయాల చరిత్రను లిఖించబోతుందని మోడీ పేర్కొన్నారు. తీర్మానాలు పెద్దవని తెలుసు.. కానీ 130 కోట్ల భారతీయుల్లో కనిపిస్తోన్న ఉత్సాహం.. విశ్వాసంతోనే భరోసాతో ముందడుగు వేశానని వివరించారు. అవీ నెరవేరుతాయని మోడీ అభిలషించారు. ఇవీ పెద్ద ప్రమాణాలు కానే కావని.. జీవితంలో పొందిన బోధనల వల్ల అలా లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వివరించారు.
భారత్-జపాన్ సహజ భాగస్వాములు అని మోడీ వివరించారు. దేశ అభివృద్దిలో జపాన్ కీలక పాత్ర పోషించిందని తెలిపారు. జపాన్తో సంబంధం సాన్నిహిత్యం, ఆధ్యాత్మికం, సహకారం, అనుబంధంతో కూడుకుందని వివరించారు. జపాన్తో బంధం గౌరవం, ప్రపంచం కోసం ఉమ్మడి సంకల్పంతో కూడుకుందని పేర్కొన్నారు. జపాన్తో సంబంధం బుద్దుడు, ధ్యానంతో కూడుకుందని పేర్కొన్నారు.
-
భారత్ కు మెషిన్ గన్స్ పంపించిన ఇజ్రాయెల్.. పాకిస్థాన్ పని ఖతం.. -
నేడే హనుమాన్ జయంతి- ఛైత్ర పౌర్ణమి నాడే -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్ -
గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగుతున్నారా - అయితే, ఇది మీ కోసమే..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!










Click it and Unblock the Notifications