ఎక్కువకి జీతం అడగరు: భారతీయులు పనిమంతులు
న్యూఢిల్లీ: నిర్ణీత పని గంటల కంటే ఎక్కువసేపు పని చేసే వారిలో భారతీయ ఉద్యోగులు ముందు ఉంటారని డేల్ కార్నేజీ సంస్థ పరిశోధనలో వెల్లడైంది. 61 శాతం మంది అదనంగా చేసిన సమయానికి జీతం ఆశించడం లేదని ఆ సంస్థ పేర్కొంది.

46 శాతం భారతీయులు ఇచ్చిన పనిని పూర్తి నిబద్ధతతో పూర్తి చేస్తారని, ఈ విషయంలో ప్రపంచ దేశాల సగటు 30గా ఉందని తేల్చింది. 58 శాతం మంది భారతీయ ఉద్యోగులు తాము అనుకున్న పనిని కచ్చితంగా పూర్తి చేస్తున్నారని, కంపెనీ లక్ష్యాలు అందుకుంటున్నారని తెలిపింది.
భారత దేశంలో పెద్ద కంపెంనీలు నిపుణులైన ఉద్యోగులను నియమించుకోవడానికే మొగ్గు చూపుతున్నాయని పేర్కొంది. నైపుణ్యం ఉన్న 71 శాతం మంది ఉద్యోగులు రూ.కోట్లలో జీతాలు అందుకుంటున్నారని తెలిపింది. భారత జాతీయ మానవ వనరుల అభివృద్ధి సంస్థ, డేల్ కార్నేజీ సంయుక్తంగా 2014 సర్వే నిర్వహించాయి.












Click it and Unblock the Notifications