అమెరికా భయంతో ఇరాన్ కు భారత్ బిగ్ షాక్...!
ఇరాన్ లో తాజాగా ఖమేనీ ప్రభుత్వంపై వెల్లువెత్తిన నిరసనల్ని సొమ్ము చేసుకుని అక్కడ ప్రభుత్వాన్ని మార్చేసేందుకు పావులు కదుపుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అదే సమయంలో ఇరాన్ మిత్రదేశాలకూ మరో కీలక హెచ్చరిక కూడా చేశారు. ఇరాన్ మిత్రదేశాలకు ట్రంప్ చేసిన ఆ హెచ్చరిక భారత్ వంటి దేశంపై బాగా పనిచేసినట్లుంది. దీని ప్రభావంతో భారత్ ఇవాళ అనూహ్యంగా తమ మిత్రదేశమైన ఇరాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది.
ఇరాన్ తో వ్యాపారం చేసే దేశాలపై మరో 25 శాతం అదనపు సుంకాలు విధిస్తానంటూ ట్రంప్ తాజాగా హెచ్చరికలు చేశారు. దీంతో ఇప్పటికే ఇరాన్ లో చబహార్ పోర్టు నిర్మిస్తున్న భారత్ కూడా ఉలిక్కిపడింది. ఇప్పటికే రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తూ ఉక్రెయిన్ యుద్దానికి ఆజ్యం పోస్టుందన్న ఆరోపణలతో 50 శాతం సుంకాలు ఎదుర్కొంటున్న భారత్ కు ట్రంప్ తాజా హెచ్చరిక తలనొప్పిగా మారింది. ఇరాన్ తో కలిసి పనిచేస్తే మరో 25 శాతం సుంకాలు ట్రంప్ విధించే ప్రమాదం ఉండటంతో ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.

ఇరాన్ లో వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ ఓడరేవు నిర్మాణంలో తన ప్రమేయాన్ని భారత్ తగ్గించడం ప్రారంభించిందని, అమెరికా ఆంక్షల ముప్పు పెరుగుతున్నందున కార్యాచరణ బాధ్యతల నుండి వెనక్కి తగ్గిందని తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత్ ఇప్పటికే ఓడరేవు ప్రాజెక్టు కోసం తన వాటా సుమారు $120 మిలియన్లను బదిలీ చేసింది. అయితే ఈ పోర్టుపై గతంలో విధించిన ఆంక్షల్లో ట్రంప్ ఇచ్చిన మినహాయింపు గడువు ఏప్రిల్ 26న ముగుస్తోంది. దీన్ని పునరుద్ధరించకూడదని తాజాగా ట్రంప్ నిర్ణయించారు. దీంతో భారత్ తప్పనిసరిగా ఈ పోర్టు విషయంలో వెనక్కి తగ్గాల్సి వస్తోంది.

జనవరి 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25 శాతం సుంకాలను ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం తమ దేశంలో నిరసనల అణచివేత కారణంగా 2,600 మందికి పైగా చనిపోయినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ట్రంప్ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చబహార్లో భారత్ ప్రయోజనాలను చూస్తున్న ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీ ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ (IPGL) ఇప్పటికే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. ప్రభుత్వం నామినేటెడ్ డైరెక్టర్లందరూ ఐజీపీఎల్ బోర్డు నుండి రాజీనామా చేశారని, ఆంక్షల నుండి తమ సిబ్బందిని రక్షించడానికి కంపెనీ ప్రజా కార్యకలాపాలను తగ్గించిందని నివేదికలు చెప్తున్నాయి.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..వీడియో -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!










Click it and Unblock the Notifications