ఫోన్ కొనడానికి ఏకంగా సింగపూర్ వెళ్లాడు! తండ్రి, కుమార్తె, ఓ ఐఫోన్ కథ!
ఓ తండ్రి తన కుమార్తె పెళ్లికి గిఫ్ట్గా ఐఫోన్ను ఇవ్వాలనుకున్నాడు. దాన్ని కొనడానికి ఏకంగా సింగపూర్ వెళ్లాడు. అక్కడ దుకాణం ముందు ఓ రాత్రంతా క్యూలో నిలబడ్డాడు. చివరికి ఐఫోన్ 8 కొన్నాడు.
సింగపూర్: ఓ తండ్రి తన కుమార్తె పెళ్లికి గిఫ్ట్గా ఐఫోన్ను ఇవ్వాలనుకున్నాడు. దాన్ని కొనడానికి ఏకంగా సింగపూర్ వెళ్లాడు. అక్కడ దుకాణం ముందు ఓ రాత్రంతా క్యూలో నిలబడ్డాడు. దాదాపు 13 గంటల పాటు క్యూలో ఉండి ఐఫోన్ 8ప్లస్ను సొంతం చేసుకున్నాడు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఐఫోన్ కి ఉన్న క్రేజ్ ఇదే. భారత్కు చెందిన వ్యాపారవేత్త అమిన్ అహ్మద్ ధోలియా తన కుమార్తెకు పెళ్లి గిఫ్ట్ కింద ఐఫోన్ 8 ప్లస్ను కొనుగోలు చేయాలని అనుకున్నాడు.
అయితే.. ఆ ఫోన్ ఇంకా భారత మార్కెట్లోకి రానందున అతడు ఫోన్ను కొనుగోలు చేసేందుకు సింగపూర్ వెళ్లాడు. ఆర్చర్డ్ రోడ్లో ఉన్న యాపిల్ స్టోర్ దగ్గర గురువారం సాయంత్రం ఏడు గంటల నుంచి వేచి ఉన్నాడు.
శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు స్టోర్ తెరవగానే వెళ్లి ఫోన్లు కొనుగోలు చేశాడు. ఈ విషయం గురించి సింగపూర్ డైలీ తన కథనంలో పేర్కొంది. 'నేను రెండు ఐఫోన్స్ కొన్నాను. ఒకటి నా కూతురికి ఇస్తాను. మొట్టమొదటిసారి రాత్రంతా నేను క్యూలో నిలబడ్డాను. ఆ అనుభూతి చాలా బాగుంది. కానీ రాత్రంతా నిలబడటం కష్టంగా కూడా అనిపించింది' అని ధోలియా ఉబ్బితబ్బిబై జరిగిందంతా చెప్పుకొచ్చాడు.
ఆయనతో పాటు దాదాపు 200 మంది విదేశీయులు క్యూలో నిలబడ్డారట ఆ ఫోన్ కొనేందుకు. సెప్టెంబరు 12న యాపిల్ ఐఫోన్ 8, 8 ప్లస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. కానీ అన్ని దేశాల్లో ఇది అందుబాటులో లేదు.