వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రిటన్ లో భారత జవాన్లుకు గాయాలు

|
Google Oneindia TeluguNews

లండన్: వేగంగా వెళుతున్న రెండు వాహనాలు ఢీకొనడంతో భారత్ సైనికులకు గాయాలైన సంఘటన బ్రిటన్ లో జరిగింది. భారత్ సైనికులతో పాటు ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలైనాయని అధికారులు వెల్లడించారు.భారత్ జవాన్లు బ్రిటన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.

లండన్ లో భారత్- బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాలలో పాల్గోంటున్నారు. గురువారం రోజు వారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండు వాహనాలలో మిలటరి పరికరాలు తీసుకుని బయలుదేరారు. మార్గం మధ్యలో వాహనాలు అదుపుతప్పాయి.

Indian soldiers injured an accident in Britain

రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 21 మంది భారత్ సైనికులతో పాటు మొత్తం 23 మందికి గాయాలైనాయి. విషయం తెలుసుకున్న అధికారులు హెలికాప్టర్ లలో బాధితులను ఆసుపత్రులకు తరలించారు.

వారిలో ఒక కెప్టన్ తో సహా ఇద్దరికి తీవ్రగాయాలైనాయని అధికారులు అన్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. రెండు వాహనాలను బ్రిటన్ మిలటరి సిబ్బంది నడుపుతున్నారని అధికారులు వెల్లడించారు.

English summary
Several Indian soldiers were injured when a vehicle carrying them met with an accident in Britain`s Salisbury Plain, the Indian Army said here on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X