బ్రిటన్ లో భారత జవాన్లుకు గాయాలు
లండన్: వేగంగా వెళుతున్న రెండు వాహనాలు ఢీకొనడంతో భారత్ సైనికులకు గాయాలైన సంఘటన బ్రిటన్ లో జరిగింది. భారత్ సైనికులతో పాటు ఇద్దరు బ్రిటన్ సైనికులకు గాయాలైనాయని అధికారులు వెల్లడించారు.భారత్ జవాన్లు బ్రిటన్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు.
లండన్ లో భారత్- బ్రిటన్ సంయుక్త సైన్యం రోజువారి కార్యక్రమాలలో పాల్గోంటున్నారు. గురువారం రోజు వారి కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండు వాహనాలలో మిలటరి పరికరాలు తీసుకుని బయలుదేరారు. మార్గం మధ్యలో వాహనాలు అదుపుతప్పాయి.
రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 21 మంది భారత్ సైనికులతో పాటు మొత్తం 23 మందికి గాయాలైనాయి. విషయం తెలుసుకున్న అధికారులు హెలికాప్టర్ లలో బాధితులను ఆసుపత్రులకు తరలించారు.
వారిలో ఒక కెప్టన్ తో సహా ఇద్దరికి తీవ్రగాయాలైనాయని అధికారులు అన్నారు. ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. రెండు వాహనాలను బ్రిటన్ మిలటరి సిబ్బంది నడుపుతున్నారని అధికారులు వెల్లడించారు.