అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి మృత్యువాత

గాలింపు జరుపుతున్న నేపథ్యంలో మంగళవారం ప్రవీణ్ మృతదేహాన్ని ఇల్లినాయిస్ పరిధిలోని కార్బండేల్లో ఉన్న అటవీ ప్రాంతంలో కనుక్కున్నట్లు పోలీసులు తెలిపారు. అతని మృతికి కారణాలేమిటనేది తెలియరాలేదని చికాగో సన్ టైమ్స్ పత్రిక రాసింది.
మోర్టన్ గ్రోవ్ ప్రాంతానికి చెందిన ప్రవీణ్ చివరిసారిగా గత బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో కార్బండేల్లో ఉన్నట్లు తెలిసిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అప్పటి నుంచి అతను కనిపించకపోవడం అన్వేషణ ప్రారంభించారు
సన్నిహితులతో కలిసి వెళ్లిన ప్రవీణ్ వరుగేసే వారితో గొడవ పడి, మధ్యలోనే అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఉంటాడని పోలీసుసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications