అమెరికాకు షాక్: గ్వామ్ ద్వీపంపై దాడికి ఉత్తర కొరియా రె'ఢీ'
ప్యాంగ్యాంగ్: గ్వామ్ ద్వీపాన్ని నామరూపాలు లేకుండా చేసేందుకు ఉత్తరకొరియా నియంత కిమ్జాంగ్ఉన్ ప్రణాళికను సిద్దం చేసినట్టు సమాచారం. అమెరికాకు చెందిన గ్వామ్ ద్వీపంపై అణుదాడి చేస్తామని, ఈ మేరకు ప్రణాళికను కూడ సిద్దం చేశామని కిమ్ ఇప్పటికే ప్రకటించారు.
అమెరికా, ఉత్తరకొరియాల మధ్య మాటల తూటాలు పేలిన తర్వాత ఫసిఫిక్ సముద్ర జలాల్లో ఉన్న అమెరికాకు చెందిన గ్వామ్ ద్వీపంపై అణుదాడి చేస్తామని కిమ్ ప్రకటించారు.
గ్వామ్పై దాడికి కిబ్ నేతృత్వంలోని కీలక అధికారులు సమావేశమైన యుద్దగది చిత్రాలను ఆ దేశ మీడియా విడుదల చేసింది. గ్వామ్ ద్వీపానికి చెందిన ఉపగ్రహ ఛాయాచిత్రాలను కిమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కొరియా, జపాన్ దేశాల సముద్ర జలాల్లో ఉన్న అమెరికా బేస్లకు చెందిన చిత్రాలు కూడ ఉన్నాయి.

కిమ్కు సహకరిస్తున్న వారిలో ఉత్తర కొరియా రాకెట్ పితామహూడు కిమ్ జాంగ్ సిక్ కూడ ఉన్నారు. ఉత్తర కొరియా అణుశక్తి కలిగిన క్షిపణులను తయారు చేయడంలో ఆయనదే కీలకపాత్ర.
ఉత్తరకొరియాకు తూర్పున ఉన్న ఓ నావల్ బేస్ నుండి జపాన్ మీదుగా గ్వామ్పై దాడి చేసేందుకు కిమ్ వ్యూహం రచించారిన దక్షిణ కొరియాకు చెందిన మిటరీ అధికారి ప్రకటించారు.
నాలుగు మధ్యతరహ శ్రేణి క్షిపణులను గ్వామ్ మీద ప్రయోగిస్తోందని చెప్పారు. ఇవి 17 నిమిషాల పాటు 3,356 కి.మీ. ప్రయాణించి గ్వామ్ దీపానికి 40 కి.మీ. దూరంలో సముద్ర జలాలను ఢీకొంటాయని ఆయన వివరించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications