భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ రద్దు చేసిన ఇరాన్.. కారణమిదే!
ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మోసాలు, అక్రమ రవాణా కేసులు పెరగడంతో ఇరాన్ సర్కారు భారతీయులకు అందించిన వీసా ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ కీలక నిర్ణయం నవంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది. ఇరాన్ టూరిజాన్ని అభివృద్ధి చేసుకునేందుకు 2024 ఫిబ్రవరిలో భారతీయుల కోసం ఈ వీసా మినహాయింపును ప్రవేశపెట్టింది. అయితే అప్పటి నుంచి అనేక సంఘటనలలో భారతీయులను తప్పుడు ఉద్యోగ హామీలతో లేదా ఇతర దేశాలకు పంపిస్తామని చెప్పి ఇరాన్కు రప్పించినట్లు నివేదికలు వచ్చాయి. అంటే ఈ నిర్ణయం ప్రధానంగా మోసాలు, అక్రమ రవాణా, కిడ్నాప్లను నిరోధించే లక్ష్యంతో తీసుకున్నందున, దీనిని భద్రతా చర్యగా పరిగణించాల్సి ఉంటుంది.
ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన
ఇండియాలోని ఇరాన్ ఎంబసీ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. "సాధారణ భారతీయ పాస్పోర్ట్ హోల్డర్ల కోసం ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో ఉన్న ఒక-మార్గం పర్యాటక వీసా రద్దు నియంత్రణల అమలు 2025 నవంబర్ 22 నుండి నిలిపివేయబడింది." అని ఇరాన్ ఎంబసీ తెలియజేసింది. నవంబర్ 22వ తేదీ నుంచి సాధారణ పాస్పోర్ట్లు ఉన్న భారతీయ పౌరులు ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించడానికి లేదా ప్రయాణించడానికి వీసా పొందవలసి ఉంటుంది. ఇరాన్ వీసా రహిత ప్రవేశం కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం మాత్రమే ఇవ్వబడింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి 15 రోజుల పాటు మాత్రమే ఇది చెల్లుబాటు అవుతుంది. ఉపాధి కోసం దీనిని ఉపయోగించడానికి వీలు లేదు.

స్పందించిన భారత్
తప్పుడు ఉద్యోగ హామీలతో లేదా ఇతర దేశాలకు తరలిస్తామనే హామీలతో భారతీయ పౌరులను ఇరాన్కు ఆకర్షించే అనేక సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. "సాధారణ భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లకు అందుబాటులో ఉన్న వీసా మినహాయింపు సౌకర్యాన్ని ఉపయోగించుకుని, వ్యక్తులను మోసం చేసి ఇరాన్కు రప్పించారు. ఇరాన్ చేరుకున్న తర్వాత వారిలో చాలా మంది డబ్బు కోసం కిడ్నాప్ చేయబడ్డారు." అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నేరపూరిత అంశాలు ఈ సౌకర్యాన్ని మరింత దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఈ చర్య చేపట్టినట్లు తెలిపింది. వీసా రహిత ప్రయాణం లేదా ఇరాన్ ద్వారా ఇతర దేశాలకు పంపిస్తామని హామీ ఇచ్చే ఏజెంట్లను నమ్మవద్దని మంత్రిత్వ శాఖ భారతీయ పౌరులకు అడ్వైజరీ జారీ చేసింది.
కిడ్నాప్ కేసుల ప్రభావం
ఈ సంవత్సరం మేలో ఆస్ట్రేలియాకు అక్రమ మార్గంలో వెళ్లిన పంజాబ్కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఇరాన్లో కిడ్నాప్ అయ్యారు. దుబాయ్-ఇరాన్ మార్గం ద్వారా వారిని ఆస్ట్రేలియాకు పంపుతామని పంజాబ్లోని ఒక ఏజెంట్ హామీ ఇచ్చాడు. అయితే, మే 1న ఇరాన్లో దిగిన వెంటనే వారు కిడ్నాప్నకు గురయ్యారు. కిడ్నాపర్లు రూ.1 కోటి డబ్బులు డిమాండ్ చేసినట్లు బాధితుల కుటుంబాలు తెలిపాయి. ఇండియా ఇరాన్ అధికారులను జోక్యం చేసుకోవాలని కోరిన తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులను రక్షించారు. నకిలీ ఉద్యోగ ఆఫర్లు కేసులు పెరిగిన నేపథ్యంలో ఇరాన్లో ఉద్యోగం కోరుకునే పౌరులు "అత్యంత అప్రమత్తతతో" ఉండాలని భారతదేశం గతంలో కూడా హెచ్చరించింది.
-
Hormuz: హార్ముజ్ లో సీమైన్స్ కనిపెట్టలేం..! చర్చల వేళ బాంబుపేల్చిన ఇరాన్..! -
అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..! -
హర్మూజ్ ను దాటిన అమెరికా యుద్ధనౌకలు.. ఇదే తొలిసారి..! -
యుద్ధంలోకి అమెరికా నేవీ.. హార్మూజ్ జలసంధి అష్టదిగ్బంధనం.. ట్రంప్ సంచలన వార్నింగ్ -
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
కిలో బియ్యం రూ.600 - రూ.800.. కేజీ మాంసం రూ. 4000 పైనే !!! -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
మరణించిన చిన్నారులతో ఇరాన్ స్పీకర్ 'శాంతి' ప్రయాణం! -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
భగవంతుడా.. కూతురు శవంతోనే ఐదు నెలలు పాటు తండ్రి.. ఏం చేశాడంటే ?? -
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..!











Click it and Unblock the Notifications