ఐసిస్ కొత్త టార్గెట్: బ్రిటిష్ రాణి పాల్గొనే సభలు
లండన్: ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) మిలిటెంట్ గ్రూపుకు చెందిన మిలిటెంట్లు ఈ వారంలో బ్రిటన్లో దాడులకు పాల్పడుతున్నారంటూ వచ్చిన వార్తా కథనాలు కలకలం రేపుతున్నాయి. బ్రటిన్ రాణి, రాజకుటుంబీకులు ఈ శనివారం పాల్గొనే రెండో ప్రపంచయుద్ధ విజయాలకు సంబంధించిన సంస్మరణ సభలేనని లండన్కు చెందిన ప్రముఖ పత్రిక మిర్రర్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది.
ప్రస్తుతం బ్రిటన్లో ఉన్న మిలిటెంట్లు కొందరు సిరియాలో శిక్షణ పొందినవారున్నారని ఆ కథనంలో పేర్కొంది. ఐసిస్ నుంచి ఈ వివరాలను రాబట్టేందుకు స్కై న్యూస్ అనే మీడియా సంస్థ ఓ ప్రణాళికను వేసింది. రెండు కల్పిత పాత్రలతో ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

పురుషుడు, మహిళ పేరుతో ట్విట్టర్, వేరే ఇతర చాటింగ్ వెబ్ సైట్ల ద్వారా చాటింగ్ చేశారు. ఈ క్రమంలోనే బ్రిటన్లో ఉన్న ఐఎస్ మిలిటెంట్లు బ్రిటన్ రాణి పాల్గొనే కార్యక్రమాలపై దాడి చేయడానికి వేసుకున్న వివరాలు తెలిశాయి. ఇటీవలే 19 మంది యువతులు తమకు లైంగిక బానిసలుగా ఉండేందుకు ఒప్పుకోలేదని ఐసీస్ మిలిటెంట్లు అత్యంత కిరాతకంగా వారి తలలు నరికి చంపేశారు.
ఈ మధ్య కాలంలో ఐసిస్ మిలిటెంట్లు అరాచకాలు మరింతగా పెరిగాయి. మహిళలపై వీరి అరాచకాలు చెప్పేందుకు వీలులేని విధంగా ఉన్నాయి. శనివారం నాడు ఇరాక్ సుప్రీం ఎలక్టోరల్ కమిషన్లో పని చేస్తున్న 300 మంది ఉద్యోగుల్ని ఐసిస్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. నినెవెహ్ ప్రావిన్స్లోగల మోసూల్లో 50 మంది మహిళలను చంపారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications