ఐసీస్ ఘాతుకం: పసికందును బాంబుతో పేల్చేశారు
బాగ్దాద్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఈ ఉగ్రవాదులు.. వారి దురాగతాలకు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇటీవల ఓ పసికందు శరీరంపై పేలుడు పదార్థాలను అమర్చి పేల్చేశారు ఈ ఉగ్రవాద రాక్షసులు. తమ దగ్గర శిక్షణలో ఉన్న వారికి పేలుడు పదార్థాలు ఎలా ఉపయోగించాలో శిక్షణ ఇస్తూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

తమ సంస్థకు చెందిన వ్యక్తిని హతమార్చడానికి సహకరించాడని ఆ చిన్నారి తండ్రిని కొంతకాలం క్రితమే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఉరితీశారు.
గతంలో ఓసారి ఐదేళ్ల బాలుడిని అడ్డంగా రెండుగా నరికి చూపించారు. మరో ఘటనలో మూడేళ్ల చిన్నారిని తల నరికేశారు. పలువురు చిన్నపిల్లల్ని సజీవసమాధి చేశారు. ఇలా ఐఎస్ అరాచకాలకు అంతులేకుండా పోతోంది.












Click it and Unblock the Notifications