ఇస్కాన్ ఆలయంపై అల్లరిమూకల దాడి: విధ్వంసం..లూటీ
ఢాకా: బంగ్లాదేశ్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. రాజధాని ఢాకాలోని ఇస్కాన్ ఆలయంపై దుండగులు దాడి చేశారు. ధ్వంసం చేశారు. గురువారం రాత్రి కాముని పౌర్ణమి వేడుకలను జరుపుకోవడానికి స్థానిక హిందువులు సన్నాహాలు చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై హిందు సంఘాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదని చెబుతున్నారు.
బంగ్లాదేశ్లో హిందువులకు మైనారిటీలుగా గుర్తింపు ఉంది. స్థానికంగా ఇస్కాన్ సహకారంతో ఢాకా శివార్లలోని వారీ ప్రాంతంలోని లాల్ మోహన్ సాహా వీధిలో రాధాకాంత ఆలయాన్ని నిర్మించుకున్నారు. ప్రతి హిందూ పండగను ఇక్కడ వైభవంగా జరుపుకుంటుంటారు. పండగ రోజుల్లో పెద్ద సంఖ్యలో గుమికూడుకుంటారు. కాముని పౌర్ణమి వేడుకలను నిర్వహించుకోవడానికి సన్నాహాలు చేసుకుంటోన్న సమయంలో దుండగులు ఆలయంపై దాడి చేశారు. విగ్రహాలను ధ్వంసం చేశారు. ఆలయం గోడలను పగులగొట్టారు.

ఈ ఘటనపై హిందూ అమెరికన్ ఫౌండేషన్ స్పందించింది. హాజీ సైఫుల్లా ఈ దాడికి నాయకత్వాన్ని వహించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ దాడిలో ముగ్గురు హిందువులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపింది. ఆలయానికి చెందిన విలువైన వస్తువులు, విగ్రహాలకు అలంకరించిన నగలు, నగదును లూటీ చేశారని పేర్కొంది. ఇలాంటి దురాగతాలను అడ్డుకోవడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం తక్షణ చర్యలను చేపట్టాలని డిమాండ్ చేసింది. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
On the night of shab-e-barat, Extremists are again attacking the Wari Radhakanta #ISKCON temple in Dhaka. We are requesting to all the Hindus to play their role in protecting the temple. #SaveBangladeshiHindus#SaveHinduTemplesInBangladesh @RadharamnDas @iskcon @india_iskcon pic.twitter.com/DVLZF7yVPG
— Voice Of Bangladeshi Hindus 🇧🇩 (@VoiceOfHindu71) March 17, 2022
కొన్ని గంటల పాటు అల్లరిమూకలు ఇస్కాన్ ఆలయంపై యథేచ్ఛగా దాడులు చేశారని, వారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి ఉపయోగం లేదని హిందూ అమెరికన్ ఫౌండేషన్ పేర్కొంది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలను వాయిస్ ఆఫ్ బంగ్లాదేశీ హిందూస్ అనే సంస్థ తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై అల్లరిమూకలు దాడికి పాల్పడినట్లు తెలిపింది.
The attack on the Radhakanta ISKCON temple in Dhaka is ongoing. The Devotees informed the police but the police are not taking any action. (17-03-22)#savebangladeshihindus pic.twitter.com/QGOuoygmGs
— Voice Of Bangladeshi Hindus 🇧🇩 (@VoiceOfHindu71) March 17, 2022
ఈ ఆరునెలల కాలంలో బంగ్లాదేశ్లో హిందూ ఆలయాలపై దాడులు చేయడం ఇది రెండోసారి. గత సంవత్సరం విజయదశమి సమయంలో ఢాకాలో హిందువులు ఏర్పాటు చేసుకున్న దుర్గమ్మ మండపాన్ని దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. హిందువులకు రక్షణ కల్పించాలని కోరింది. భారత్ విజ్ఞప్తికి బంగ్లాదేశ్ స్పందించలేదనేది తాజాగా ఉదంతంతో స్పష్టమైంది.
Video 3... #SaveBangladeshiHindus pic.twitter.com/wVY9AH7EBY
— Voice Of Bangladeshi Hindus 🇧🇩 (@VoiceOfHindu71) March 17, 2022
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications