ఈ దీవికి వెళ్తే ప్రాణం హుష్.. ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ ప్లేస్ ఇదే !!
ప్రపంచంలో అందమైన ప్రదేశాలకే కాదు, చూస్తేనే ఒళ్ళు గగుర్పొడిచే భయంకరమైన ప్రాంతాలకు కూడా కొదవలేదు. అలాంటి వాటిలో ఇటలీలోని వెనిస్ నగరం పక్కనే ఉన్న 'పోవెగ్లియా' (Poveglia) దీవి ఒకటి. వెనిస్ నగరం తన అందమైన కాలువలు, పడవ ప్రయాణాలకు ఎంత ప్రసిద్ధి చెందిందో, దానికి కొద్ది దూరంలోనే ఉన్న ఈ చిన్న దీవి అంతటి చీకటి చరిత్రను కలిగి ఉంది. దీనిని స్థానికులు 'మృత్యు దీవి' లేదా 'దెయ్యాల దీవి' అని పిలుస్తారు. ప్రస్తుతం ఇటలీ ప్రభుత్వం ఈ దీవిలోకి సామాన్యులెవరూ అడుగుపెట్టకుండా నిషేధం విధించింది.
శరణార్థుల నుంచి శ్మశానం వరకు..
ఈ దీవి చరిత్ర క్రీ.శ. 421లో మొదలైంది. ప్రారంభంలో బార్బేరియన్ల దాడుల నుంచి తప్పించుకోవడానికి సాధారణ ప్రజలు ఇక్కడ ఆశ్రయం పొందారు. శతాబ్దాల పాటు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతం, 18వ శతాబ్దం నాటికి ఒక భయంకరమైన మరణ శిబిరంగా మారిపోయింది. యూరప్ను వణికించిన 'బ్యుబోనిక్ ప్లేగు' వ్యాధి సోకిన వారిని ఇక్కడికి తరలించి క్వారంటైన్ చేసేవారు. వ్యాధి ముదిరిన వారిని కుటుంబాల నుంచి వేరు చేసి, ఈ దీవిలోనే వదిలేయడంతో లక్షకు పైగా ప్రజలు ఇక్కడే ప్రాణాలు కోల్పోయారు.

చిత్రహింసల నిలయంగా ఆసుపత్రి..
ప్లేగు మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత, 1922లో ఈ దీవిలో ఒక మానసిక చికిత్సాలయాన్ని (Asylum) ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ రోగులకు వైద్యం కంటే చిత్రహింసలే ఎక్కువగా ఉండేవని కథలు ఉన్నాయి. అక్కడి వైద్యులు మత్తుమందు ఇవ్వకుండానే రోగుల మెదడుపై వింత ప్రయోగాలు చేసేవారని, ఆ ఆసుపత్రి గదుల్లో రోగుల ఆర్తనాదాలు మిన్నంటేవని చెబుతారు. కాలక్రమేణా ఆ ఆసుపత్రిని మూసివేసినప్పటికీ, నేటికీ ఆ భవనాలు, తుప్పు పట్టిన వైద్య పరికరాలు అక్కడ భయంకరంగా కనిపిస్తాయి.
ఆత్మల సంచారం..
నేడు ఈ దీవి పూర్తిగా నిర్మానుష్యంగా మారింది. ఇక్కడ చనిపోయిన లక్షలాది మంది మృతదేహాలను సామూహికంగా పూడ్చిపెట్టడం లేదా తగలబెట్టడం వల్ల, అక్కడి మట్టిలో సగం భాగం మనుషుల అస్థికలే ఉంటాయని అంటారు. రాత్రి వేళల్లో ఈ దీవి నుంచి వింత వింత శబ్దాలు వినిపిస్తాయని, ప్లేగు మాస్కులు ధరించిన ఆకృతులు కనిపిస్తాయని పారానార్మల్ నిపుణులు చెబుతుంటారు. అందుకే స్థానిక మత్స్యకారులు కూడా ఈ దీవి పరిసరాల్లో వేట సాగించడానికి భయపడతారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications