Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మత కార్యక్రమంలో భారీగా తొక్కిసలాట..38 మందికి పైగా భక్తులు మృతి: గుట్టలుగా మృతదేహాలు

జెరూసలెం: ఇజ్రాయిల్‌ (Israel)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ మత కార్యక్రమంలో సంభవించిన భారీ తొక్కిసలాటలో 38 మందికి పైగా భక్తులు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే జాతీయ విపత్తు నిర్వహణ బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన ఘటనగా వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్ కాలమానం ప్రకారం.. ఈ తెల్లవారు జామున ఈ ఘటన చోటు చేసుకుంది. ల్యాగ్ బీఒమర్ (Lag B'Omer) పేరుతో ప్రతి సంవత్సరమూ స్థానికులు పెద్ద ఎత్తున మత కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. యూదులకు ఇది అతి ముఖ్యమైన పండుగ. మంటలను రగిలించి అందులో పాత వస్తువులను పడేస్తారు. రాత్రి జాగారణ చేస్తారు. ప్రత్యేక ప్రార్థనలను నిర్వహిస్తారు. మంటల చుట్టూ సంప్రదాయబద్ధంగా నృత్యం చేస్తారు.

ఇజ్రాయిల్ ఉత్తర ప్రాంతం గెలిలీలోని మౌంట్ మెరాన్‌లో ఈ తెల్లవారు జామున ఈ కార్యక్రామాన్ని నిర్వహించారు. వేలాదిమంది యూదులు అల్ట్రా అర్థోడాక్స్ దీనికి తరలివచ్చారు. కుటుంబాలతో సహా హాజరయ్యారు. రెండో శతాబ్దానికి చెందిన సగె రబ్బీ షిమోన్ బార్ యోచి సమాధి వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా నివసించే యూదులకు అతి పవిత్రమైన ప్రదేశం ఇది. తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ ప్రదేశాన్ని సందిర్శించాలని భావిస్తుంటారు. అలాంటి చోట భక్తులు ప్రార్థనలు నిర్వహిస్తోన్న సమయంలో అనూహ్యంగా తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనికి కారణాలేమిటనేది ఇంకా తెలియరాలేదు.

అక్కడున్న ఓ స్టేడియం కప్పు కూలిపోయిందంటూ వార్తలు రావడం వల్ల భక్తులు భయాందోళనలకు గురి కావరని, ఫలితంగా తొక్కిసలాట చోటు చేసుకుందనేది ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జాతీయ అత్యవసర సర్వీసుల విభాగం మెగాన్ డేవిడ్ ఆడమ్ (ఎండీఏ) అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 103 మందికి పైగా గాయపడినట్లు ఎండీఏ అధికారులు నిర్ధారించారు. గాయపడిన వారు ఇంకా చాలామంది ఉన్నారని తెలిపారు.

 Israel stampede: Dozens killed in crush at religious festival attended by tens of thousands

Recommended Video

    #MRSAM : India Successfully Test-Fires Medium Range Surface-To-Air Missile For Army

    గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి వచ్చీపోయే అంబులెన్సులు, పోలీసులు, జాతీయ విపత్తు నిర్వహణ బలగాల వాహనల సైరన్ మోతలతో ఆ ప్రదేశం మొత్తం భీతావహంగా మారింది. ఈ ఘటన పట్ల ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యంత బాధాకరమైన ఘటనగా వ్యాఖ్యానించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సను అందించాలని ఆదేశించారు. ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+