ఇస్లామిక్ స్టేట్ వార్నింగ్: జపాన్ హై అలర్ట్
టోక్యో: ఉగ్రవాదులు దాడులు చేస్తామని బెదిరించడంతో జపాన్ అలర్ట్ అయ్యింది. ప్రపంచ దేశాల్లోని తమ విదేశాంగ శాఖ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యాలని తమ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇండోనేషియా, హెర్జిగోవినా, మలేషియా, బోస్నియా లో తాము దాడులు చేస్తామని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు (ఐఎస్ఐఎస్) ప్రకటించారు. ఈ నేపద్యంలో జపాన్ వేగంగా స్పందించింది. అత్యవసరంగా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం ఏర్పాటు చేసింది.
అవసరం అయితే మరింతమంది సైనికులను సమీకరించుకోవాలని విదేశాంగ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చాయని శుక్రవారం జపాన్ విదేశాంగ శాఖ మంత్రి ఫూమియో కిషీదా స్థానిక మీడియాకుచెప్పారు.

ఈ నాలుగు దేశాలతో పాటు జపాన్ విదేశాంగ శాఖకు చెందిన అన్ని కార్యాలయాలకు భద్రత కల్పిస్తామని అన్నారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు ఒక ఆంగ్ల వెబ్ సైట్ కార్యాలయానికి ఫోన్ చేసి బెదిరించారు. ఇద్దరు జపానీయులను బంధీలుగా పట్టుకుని వారి తలలు నరికేశారు.
8 నెలల క్రితం ఇద్దరు జపనీయులు ఇస్లామిక్ స్టేట చేతిలో హత్యకు గురైనారు. జపాన్ మీద ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు పగ పెంచుకున్నారని గుర్తించిన జపాన్ పసిపిక్ తీరం వెంబడి ఉన్న అన్ని దేశాల్లోని తమ విదేశాంగ కార్యాలయాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications