కాబుల్ జంట పేలుళ్లు: ‘దాడి చేసిన వారిని క్షమించం.. వెంటాడి, వేటాడుతాం’ - జో బైడెన్

బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.
"ఈ మిషన్ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు" అని బైడెన్ అన్నారు.
అలాగే కాబుల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.
గురువారం నాడు (ఆగస్ట్ 26) స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటలకు దాడి జరిగింది.
ముందుగా ఎయిర్పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.
అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.
కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది.
బ్రిటన్కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్లో పరిశీలిస్తుంటారు.
బాంబు పేలుళ్లలో 13మంది అమెరికన్లు సహా 60 మంది చనిపోయారు.
ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ శాఖ అయిన ఐసిస్-K దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ప్రజలను తరలిస్తున్న విమానంలో తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో వేలాది మంది అఫ్గాన్లు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చారు.
కాబుల్ జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఈ జిహాదీ గ్రూప్ ప్రకటించుకుంది.
- కాబుల్ ఎయిర్పోర్ట్ సమీపంలో బాంబు పేలుళ్లు, 60 మంది మృతి
- అఫ్గానిస్తాన్: 'ఓటమి ఎరుగని' పంజ్షీర్ లోయ కథ

'మేము మర్చిపోం, వారిని వెంటాడి, వేటాడుతాం'
"మేము క్షమించం. మేము మర్చిపోం. మేం వారిని వదిలిపెట్టం. వెంటాడి వేటాడుతాం. పేలుళ్లకు వాళ్లు మూల్యం చెల్లించుకునేలా చేస్తాం" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
చనిపోయిన వారిలో 11 మంది సైనికులు, ఒక నేవీ వైద్య సిబ్బంది ఉన్నారని అమెరికా సెంట్రల్ కమాండ్ జనరల్ ఫ్రాంక్ మెకంజీ చెప్పారు.
ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలు అర్పించిన హీరోలుగా దాడిలో మరణించిన అమెరికన్ సైనికులను అభివర్ణించారు బైడెన్.
ఐసిస్- కే నుంచి ముప్పు ఎక్కువగా ఉందని, మళ్లీ దాడులు జరగకుండా ఎలా ఆపాలనే దానిపై తాలిబాన్లతో కలిసి పనిచేస్తున్నామని జనరల్ ఫ్రాంక్ మెకంజీ చెప్పారు. తాలిబాన్లు ఇప్పటికే చాలా దాడులను నిలువరించారని వెల్లడించారు.
ఆగస్ట్ 15న కాబుల్ తాలిబాన్ల వశమైంది. అప్పటి నుంచి లక్ష మందికి పైగా కాబుల్ నుంచి తరలించారు.
ఆగస్ట్ 31లోగా అమెరికా సేనలు అఫ్గాన్ వదిలి వెళ్లిపోవాలని తాలిబాన్లు డెడ్లైన్ పెట్టారు.
ఆ డెడ్లైన్లోగా దేశం వదిలి వెళ్లేందుకు చాలామంది అఫ్గాన్లు కాబుల్ ఎయిర్పోర్టుకు వస్తున్నారు.

అయితే, తరలింపు ప్రక్రియను ఈ పేలుళ్లు మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉంది.
కాబుల్ ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం 5800 మంది అమెరికా సైనికులు, మరో వెయ్యి బ్రిటన్ బలగాలు ఉన్నాయి.
ఇప్పటి వరకు 104000 మంది పౌరులను అఫ్గాన్ నుంచి తరలించారు. వీరిలో 66వేల మంది అమెరికన్లు, 37వేల మంది మిత్రపక్షాల సభ్యులు ఉన్నారు.
సుమారు ఐదు వేల మంది ప్రజలు విమానాశ్రయం బయట ఎదురుచూస్తున్నారు. మరెంతో మంది చెక్ పోస్టులను దాటుకుని అక్కడికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కెనడా, బెల్జియం, నెదర్లాండ్స్, డెన్మార్క్ వంటి దేశాలు తమ ఆపరేషన్లను ఇదివరకే నిలిపేశాయి.
గత ఆరేళ్లుగా ఎయిర్పోర్ట్ వద్ద భద్రత కల్పిస్తున్న టర్కీ.. తమ బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.
బాంబు పేలుళ్ల తర్వాత అత్యవసర సమావేశం నిర్వహించిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కాబుల్ నుంచి తరలింపు ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుంచి బురఖాలో బందీ అయినంతవరకు
- సొరాయా: అఫ్గానిస్తాన్లో మహిళల హక్కుల కోసం కృషిచేసిన ఈ రాణి చివరికి ఇటలీ ఎందుకు పారిపోయారు
- ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్డోజర్' ఎలా అయ్యారు?
- 'మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
- ఐఎస్లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ
- అఫ్గానిస్తాన్: ఐఎస్లో చేరి అఫ్గాన్లో జైలు పాలైన భారత మహిళ 'నిమిష' ఇప్పుడెక్కడ?
- ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి
- జాడలేని ఐఎస్ జిహాదీల భార్యలు, పిల్లలు
- తాలిబాన్ల పాలనలో అల్ ఖైదా, ఐఎస్లకు అఫ్గానిస్తాన్ అడ్డాగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)
-
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..!












Click it and Unblock the Notifications