ఎల్టీటీఈ ప్రభాకర్ బతికున్నాడా!?: మిస్సింగ్ లిస్ట్లోకి..
కొలంబో: ఎల్టీటీఈ ప్రభాకరణ్ హతమై ఏడేళ్లు అవుతోంది. అయినా ఆయన పేరు 'మిస్సింగ్' జాబితాలో పేర్కొంటానని చెబుతుండటం గమనార్హం. శ్రీలంక ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్కు ప్రభాకరన్ పేరును సూచిస్తానని శ్రీలంక తమిళ నేషనల్ అలయన్స్ నాయకుడు శివలింగం అన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 2009లో ప్రభాకర్ను హతమార్చినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా విడుదల చేసింది.

శ్రీలంకలోని ప్రభాకరన్ సోదరుడు లేదా సోదరి కానీ ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్లో పేరు నమోదు చేయాలనుకుంటే తాను అండగా నిలుస్తానని చెప్పారు. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్ను స్థాపించనున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది.
దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. దీని స్థాపన అంటే ఎల్టీటీఈతో పోరాడిన సైనికులను మోసం చేయడమే అంటున్నారు. 2009లో పోరు ముగిసిన తర్వాత నుంచి ఇప్పటి దాకా దాదాపు పదహారు వేల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications