Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఐక్యంగా ఉండకపోతే సింహాన్నీ కుక్కలు వేటాడుతాయి: చికాగో హిందూ సభలో మోహన్‌భగవత్

చికాగో: ఆధిపత్యం కోసం హిందువులు ఎప్పుడూ ఆరాటపడలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. ఆధిపత్యం చెలాయించడం, పెత్తనం చేయడం హిందూ తత్వం కాదని స్పష్టం చేశారు. అమెరికాలోని చికాగోలో జరిగిన రెండవ ప్రపంచ హిందూ సదస్సులో ఆయన పాల్గొన్నారు.

1893లో వివేకానంద..

1893లో వివేకానంద..

1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన ప్రపంచ మతాల సమ్మేళనంలో పాల్గొని, చారిత్రక ఉపన్యాసం చేశారు. ఆ సభ జరిగి 125 సంవత్సరాలు ముగిసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు వివిధ కులాలకు చెందిన 2,500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి భగవత్ మాట్లాడుతూ.. ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడం హిందూ మౌలిక సూత్రాలకు విరుద్ధమన్నారు.

ఐక్యంగా లేకుంటే సింహాన్నైనా కుక్కుల వేటాడుతాయి..

ఐక్యంగా లేకుంటే సింహాన్నైనా కుక్కుల వేటాడుతాయి..

అన్ని కులాలు, జాతులు ఒకటిగా కలిసి, హిందూ ఐక్యతను చాటాలన్నారు. ఇది ఇతరులపై ఆధికారానాన్ని చెలాయించడానికి కాదని వివరించారు. ఒంటరిగా ఉంటే సింహంపైన కూడా అడవి కుక్కలు దాడి చేసి చంపుతాయని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని మరచిపోకూడదని అన్నారు. మెరుగైన ప్రపంచాన్ని కోరుతున్నామని, వసుధైక కుటుంబమే హిందువుల నినాదమని అన్నారు. సంప్రదాయాలను పాటించడం అవసరమని అన్నారు. అయితే తాను ఆధునీకరణకు వ్యతిరేకిని కానని స్పష్టం చేశారు.

మన ధర్మం సనాతనం.. అత్యాధునికం

మన ధర్మం సనాతనం.. అత్యాధునికం

హిందూ ధర్మం అత్యంత సనాతనమైనదేకాకుండా, అత్యంత ఆధునికమైనదని వ్యాఖ్యానించారు. ‘సుమంత్రితే సువిక్రంతే' (సమష్టిగా ఆలోచించు.. గొప్ప విజయాన్ని సాధించు) అనేదే సూత్రం ఆధారంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ విధానమే యావత్ ప్రపంచాన్ని ఒకటి చేస్తుందని భగవత్ అన్నారు. అహాన్ని అదుపు చేసుకొని, అందరి అభిప్రాయాలనూ గౌరవించడం నేర్చుకుంటే వసుధైక కుటుంబ సాధ్యమవుతుందని తెలిపారు. కృష్ణ భవగవానుడు, ధర్మరాజు పరస్పరం ఎప్పుడూ విభేదించుకోలేదని గుర్తుచేశారు.

అదే తక్షణ కర్తవ్యం

అదే తక్షణ కర్తవ్యం

రాజకీయాలకు, యుద్ధనీతికి ప్రతీకగా మహాభారతం నిలుస్తుందని మోహన్ భగవత్ చెప్పారు. రాజకీయాలను ధ్యానంలా చేయకూడదని భగవత్ వ్యాఖ్యానించారు. హిందూ సమాజంలో అసాధారణ ప్రతిభాపాటవాలున్న వారి సంఖ్య చాలా ఎక్కువని అన్నారు. అయితే, వీరంతా ఒకేతాటిపైకి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ ఏకమైతే, పరిస్థితి మరో విధంగా ఉంటుందన్నారు. మూల సూత్రాలను మరచిపోతున్నందువల్లే హిందూ జాతి కొన్ని శతాబ్దాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నదని భవగత్ గుర్తుచేశారు. హిందువుల ఐక్యత తక్షణ కర్తవ్యమని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+