ఆకాశంలో తూర్పు దిక్కున అద్భుతం ఆవిష్కృతం
వాషింగ్టన్: ఆకాశంలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. అంతరిక్ష వీక్షకులను అబ్బురపరిచింది. ఎన్నో అంతుచిక్కని, అంతు లేని నిలయంగా మారిన అంతరిక్షంలో తాజాగా చోటు చేసుకున్న ఈ సదృశ్యం అత్యంత అరుదుగా సంభవిస్తుంటుంది. అదే.. చందమామ- శుక్రగ్రహాల కలయిక (Moon and Venus conjunction).
చంద్రుడు (Moon), శుక్రగ్రహం (Venus) అత్యంత సమీపానికి వచ్చాయి. ఈ తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఈ సెలెస్టియల్ కంజంక్షన్ ఏర్పడింది. సుమారు రెండున్నర నుంచి మూడు గంటల పాటు కొనసాగింది. తూర్పు- ఆగ్నేయ దిశలో కనువిందు చేసింది ఈ ఖగోళ సదృశ్యం.

అమావాస్య సమీపిస్తోన్నందున.. చందమామ క్షీణిస్తూ వస్తోంది. పరిణామంలో 15 శాతం కంటే తక్కువగా కనిపించింది. కృష్ణపక్ష ఘడియలు ఎక్కువ రోజులు లేవు. ఈ నెల 12వ తేదీన అమావాస్య కావడం వల్ల చంద్రుడు క్షీణదశలో ఉన్నాడు. అదే సమయంలో ఈ కంజంక్షన్ ఏర్పడింది.
శుక్రగ్రహంతో కలిసి చంద్రుడు శుక్రుడి మీదుగా చందమామ తన ప్రయాణాన్ని సాగించడం వల్ల ఈ కంజంక్షన్ సంభవించింది. చంద్రుడికి కుడి వైపున పైభాగంలో మెరుస్తూ కనిపించింది వీనస్. యూరప్, పశ్చిమ రష్యా, గ్రీన్ల్యాండ్, ఆఫ్రికా, ఆసియా, స్వాల్బార్డ్లల్లో ఈ కంజంక్షన్ కనిపించింది.
చంద్రుడు- శుక్రగ్రహాలకు జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రత్యేకత ఉంది. కృష్ణపక్ష చంద్రుడితో కలిసి- శుక్రగ్రహం కనిపించడాన్ని అరుదుగా భావిస్తారు. గతంలో ఇలాంటి ఖగోళ సదృశ్యాలు సంభవించిన సందర్భాలు అరుదుగా చెబుతున్నారు. అమావాస్య సమీపిస్తోన్న రోజుల్లో శుక్రగ్రహంతో కలిసి చంద్రుడు కనిపించడాన్ని అశుభంగా పరిగణిస్తోన్నారు.












Click it and Unblock the Notifications