వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండోనేసియా, తూర్పు తైమూర్‌ల్లో వరదలు... 50 మందికి పైగా మృతి - News Reel

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఇండోనేసియాలోని ఈస్ట్ ఫ్లోర్స్ ప్రాంతం

అకస్మాత్తుగా వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల ఇండోనేసియా, తూర్పు తైమూర్ దేశాల్లో ఆదివారం యాభైకిపైగా మంది చనిపోయారు.

ఈ రెండు దేశాల్లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.

వరద విపరీతంగా వచ్చి చేరడంతో డ్యాముల నుంచి నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వేల సంఖ్యలో ఇళ్లు వరద ముంపుకు గురయ్యాయి.

ఇండోనేసియా తూర్పు ప్రాంతంలోని ఫ్లోర్స్ ద్వీపం నుంచి పొరుగున ఉన్న దేశమైన తూర్పు తైమూర్ వరకూ ఈ వరదలు ప్రభావం చూపిస్తున్నాయి.

గల్లంతైనవారి కోసం రక్షక సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఇండొనేసియా

''నాలుగు ఉప జిల్లాలు, ఏడు గ్రామాలపై ఈ వరదలు ప్రభావం చూపించాయి. క్షేత్ర స్థాయిలో ఉన్న మా బృందంతో మాట్లాడి సమాచారాన్ని ధ్రువీకరించుకున్నాం. ఇప్పటివరకూ 41 మంది మరణించినట్లు గుర్తించాం. మరో 27 మంది గల్లంతయ్యారు. తొమ్మిది మంది గాయపడ్డారు’’ అని ఇండోనేసియన్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ అధికార ప్రతినిధి రాదిత్య జాటి తెలిపారు.

మరోవైపు తమ మున్సిపాలిటీ పరిధిలో 60 మంది దాకా మరణించారని తూర్పు ఫ్లోర్స్ డిప్యూటీ రెజెంట్ ఆగస్టినస్ పయోంగ్ బోలి చెప్పారు. అయితే, ఆయన చెప్పిన గణాంకాలను ఇండోనేసియా జాతీయ అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
More than 50 killed in floods in Indonesia, East Timor
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X