నవాజ్ షరీఫ్తో ప్రధాని మోడీ కరచాలనం(ఫొటో)
ప్యారిస్: ఫ్రాన్స్లోని పారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ వాతావరణ సదస్సు సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్లు కలుసుకున్నారు. ఆత్మీయంగా వారు కరచాలనం చేసుకోవడం మీడియా దృష్టిని ఆకర్షించింది.
సోమవారం ప్యారిస్లో వాతావరణ మార్పులపై అంతర్జాతీయ స్థాయి సదస్సు(సిఓపి-21) ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరైన మోడీ, షరీఫ్లు ఒకరినొకరు కలుసుకుని నవ్వుతూ కరచాలనం చేశారు.

ఈ ఫొటోను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి దాదాపు 140 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.
PM @narendramodi meets PM Nawaz Sharif at COP 21 in Paris pic.twitter.com/HRiY1xLoBM
— Vikas Swarup (@MEAIndia) November 30, 2015 కాగా, ఈ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోడీ మొదట ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకొయిస్ హొలాండ్ను కలుసుకున్నారు. ఆయనతో మర్యాదపూర్వకంగా కరచాలనం చేశారు. ఆ తర్వాత వివిధ దేశాధినేతలను పలుకరించారు.
ఈ సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ మాట్లాడుతూ.. వాతావరణ మార్పులపై ప్రస్తుత సదస్సు అత్యంత కీలకమైనదని, ఈ సదస్సులో వెలువడే నిర్ణయం ప్రస్తుతమున్న ప్రజల తలరాతనే కాదు.. రాబోయే తరాల ప్రజలపైనా ప్రభావం చూపుతుందని, ఈ సదస్సులో సానుకూల నిర్ణయాన్ని ప్రపంచం ఆశిస్తున్నదని చెప్పారు.












Click it and Unblock the Notifications