మేయర్కు అభినందన: బ్రిస్బెన్లో మోడీ (పిక్చర్స్)
బ్రిస్బేన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఆస్ట్రేలియాలోని బ్రిస్బన్లో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహాత్ముడి సిద్ధాంతాలకు గౌరవమిస్తున్న బ్రిస్బేన్ నగర మేయర్ను మోడీ అభినందించారు.
గాంధీ సిద్ధాంతాలు నేటికీ అనుసరణీయమేనన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి తాను గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తున్నానని చెప్పారు. అక్టోబర్ 2 కేవలం గాంధీ పుట్టిన రోజే కాదని, ఆ రోజు ఓ కొత్త శకం ప్రారంభమైందన్నారు. ప్రకృతిని గాందీజీ ఎంతగానో ప్రేమించేవారన్నారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రెండు ప్రధాన సమస్యల్లో గ్లోబల్ వార్మింగ్, ఉగ్రవాదం ఉన్నాయన్నారు. మహాత్ముడి విగ్రహావిష్కరణలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. గాంధీజీ సిద్దాంతాలు నేటికీ ఆదర్శమని చెప్పారు. గాంధీ జీవితాన్ని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. గాంధీజీ తమకు అహింసా మార్గాన్ని చూపించారన్నారు.
మోడీ
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు జెర్మన్ ఛాన్స్లర్ అంజెలా మోర్కెల్తో భేటీ అయిన దృశ్యం.
మోడీ
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం నాడు సౌదీ అరేబియా ఉప ప్రధానితో చేతులు కలుపుతున్న దృశ్యం.
మోడీ
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టియానే లగార్డేతో భేటీ అయినప్పటి దృశ్యం.
మోడీ
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం నాడు కెనెడియన్ కౌంటర్ పార్ట్ స్టీఫెన్ హార్పట్తో చేతులు కదుపుతూ..