Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నేపాల్ మాజీ ప్రధాని సంచలనం!

నేపాల్ మాజీ ప్రధాని, సీపీఎన్-యూఎంఎల్ అధ్యక్షుడు కేపీ శర్మ ఓలీ తాను దేశం విడిచి పారిపోవడానికి ప్లాన్ చేస్తున్నాననే పుకార్లకు చెక్ పెట్టారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తన భద్రతను, అధికారిక విశేషాధికారాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని కేపీ శర్మ ఓలీ నేపాలీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. భక్తపూర్, గుండూలో జరిగిన ఒక సభలో ఓలీ మాట్లాడుతూ.. తాను దేశం విడిచి ఎక్కడికీ వెళ్లనని అన్నారు. ఇక్కడే ఉండి రాజకీయ పోరాటం చేయాలనేది తన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.

తన మద్దతుదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. "ఈ నిరాధారమైన ప్రభుత్వాన్ని దేశానికి అప్పగించి మనం పారిపోతామని మీరు అనుకుంటున్నారా?" అని ప్రశ్నించారు. నేపాల్‌లో శాంతి, సుపరిపాలన, రాజ్యాంగ వ్యవస్థను పునరుద్ధరించడానికి తాను కట్టుబడి ఉన్నానని ఓలీ స్పష్టం చేశారు.

Nepal Ex-PM KP Sharma Oli Refutes Rumors of Fleeing

హింసాత్మక నిరసనల తర్వాత పదవి నుంచి వైదొలగిన ఓలీ
నేపాల్‌లో జరిగిన భారీ హింసాత్మక నిరసనల కారణంగా మాజీ ప్రధాని ఓలీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. సెప్టెంబర్ 9న ఆయన బలువతార్‌లోని ప్రధానమంత్రి అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. అంతే కాకుండా ప్రదర్శనకారులు బాల్‌కోట్‌లోని ఆయన ప్రైవేట్ నివాసానికి నిప్పుపెట్టారు. అప్పటి నుంచి ఓలీ గుండూలోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. సుశీలా కార్కీ నేతృత్వంలోని ప్రస్తుత పరిపాలనకు చట్టబద్ధత లేదని ఓలీ ఆరోపించారు. ఈ ప్రభుత్వం ప్రజల ఇష్టానుసారం కాకుండా.. దుశ్చర్యలు, దహనకాండ ద్వారా అధికారంలోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

నా ఆదేశాలను బహిరంగపరచండి
ప్రభుత్వాన్ని ఓలీ సవాలు చేస్తూ.. నిరసనల సమయంలో రాష్ట్ర అధికారులతో తాను జరిపిన అన్ని సంభాషణలను బహిరంగంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు."వాటిని ధైర్యంగా ప్రచురించండి. నేను ఇచ్చిన ఆదేశాలను ప్రజల్లోకి తీసుకురండి" అని సవాలు విసిరిన ఆయన.. తన దగ్గర దాచడానికి ఏమీ లేదని స్పష్టం చేశారు. కొత్త దాడుల బెదిరింపుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకు భద్రతను కల్పించడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు."సోషల్ మీడియాలో నా నివాసంపై దాడి చేస్తామని బహిరంగంగా బెదిరిస్తున్నారు. ప్రభుత్వం ఏం చేస్తోంది? కేవలం చూస్తూ కూర్చుంటుందా?" అని ఆయన ప్రశ్నించారు.

పాస్‌పోర్టుల జప్తుపై అభ్యంతరం
ప్రభుత్వం తనతో పాటు నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా, ఆర్జు రాణా దేవుబా, రమేష్ లేఖక్, దీపక్ ఖడ్కా వంటి పలువురు నేతల పాస్‌పోర్టులను జప్తు చేయాలని నిర్ణయించుకుందనే వార్తలపై కూడా ఓలీ అభ్యంతరం తెలిపారు. జెనరేషన్ Z నిరసనల సమయంలో నేపాల్‌లో చాలా మంది ప్రజలు మరణించారు. సెప్టెంబర్ 8న నిరసనలు ప్రశాంతంగా ఉన్నప్పటికీ, మరుసటి రోజు జరిగిన పోలీసు కాల్పుల కారణంగా తీవ్ర హింస చెలరేగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+