కూలిన విమానం: అంతా మృతి, ఎవరూ మిగలలేదు
ఖాట్మండ్: ఇటీవల జరిగిన విమాన ప్రమాదం నుంచి ఎవరూ బయటపడలేదని నేపాల్ పోలీసులు సోమవారం చెప్పారు. ఇటీవల నేపాల్లో ఓ విమానం కూలింది. 18 మంది ప్రయాణికులతో బయలుదేరిన నేపాల్ ఎయిర్లైన్స్ విమానం కూలిపోయింది. దాని శకలాలను పోలీసులు సోమవారం గుర్తించారు.
పర్యాటక కేంద్రమైన పొఖారా పట్టణం నుంచి బయలుదేరిన కొద్ది సేపటికే విమానం నుంచి సంకేతాలు రావడం ఆగిపోయింది. ఆదివారం బయలుదేరిన ఈ విమానంలో 18 మంది ప్రయాణిస్తున్నారు. ఖాట్మండ్కు ఈ ప్రాంతం 253 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

విమానం పర్వత ప్రాంతంలో కూలిపోయింది. దాని శకలాలు ఓ గ్రామంలో కనిపించాయి. అయితే, ఎవరూ బతికి బయటపడలేదని ఖాట్మండ్ విమానాశ్రయం చీఫ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ బిమ్లేష్ లాల్ కర్నా చెప్పారు.
విమానంలో ఉన్నవారిలో 15 మంది ప్రయాణికులు కాగా, ముగ్గురు సిబ్బంది. ఈ విమానంలో ఓ డెన్మార్క్ ప్యాసెంజర్ ఉన్నట్లు సమాచారం. అధికార నేపాలీ కాంగ్రెసు పార్టీ నాయకుడు మనబ్ సెజువాల్ కూడా ఇందులో ఉన్నారు.
విమానాన్ని వెతకడానికి రెండు హెలికాప్టర్లను నియోగించారు. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి వచ్చాయి. చివరకు అర్ఘఖంచి జిల్లాలో ఏరియల్ సర్వే చేసి విమానం శకలాలను కనుక్కున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications