భారత్, పాక్ ను అణ్వాయుధాలు కలిగిన దేశాలుగా ఎప్పటికీ గుర్తించలేమన్న డ్రాగన్
బిజింగ్ : డ్రాగన్ చైనా మరోసారి తన కపటనీతిని బయటపెట్టింది. ఇటీవల జరిగిన పరిణామాలతో .. తన మిత్రదేశం పాకిస్థాన్ పై కఠినవైఖరి అవలంభినట్టు కనిపించినా .. కానీ అది మాటలకే అనే పరిమితంగా తన ధోరణిని మరోసారి నిరూపించుకుంది.
మారని డ్రాగన్ వైఖరి ..
భారత్, పాకిస్థాన్ అణుశక్తి కలిగి, వాటి విస్తరణ కోసం చర్యలు చేపడుతున్నాయనే భావించలేమని పేర్కొంది. ఇటీవల వియత్నాంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ యున్ అణు శక్తిపై జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో చైనా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ అంశంపై భారత్, పాకిస్థాన్ పై మా వైఖరిలో మార్పు లేదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఎన్పీటీలో సంతకం చేయలేదని సాకు
అణు సరఫరా సమూహం (ఎన్ఎస్జీ)లో ప్రవేశించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను డ్రాగన్ చైనా అడ్డుకుంటోంది. దీనిని భారత్ న్యూక్లియర్ నాన్ ప్రొలిఫేరషన్ ట్రిటీ కోసం సంతకం చేయాలలేదనే సాకును తెరపైకి తీసుకొస్తోంది. వాస్తవానికి ఎన్ ఎస్ జీ సభ్యదేశాల్లో చేరేందుకు భారత్ దరఖాస్తు చేసింది. ఆ వెంటనే పాకిస్థాన్ కూడా ఆఫ్లై చేయడంతో గొడవ మొదలైంది. ఈ సందర్భంగా భారత్, పాకిస్థాన్ ముందు ఎన్సీటీ కోసం ఆప్లై చేయలేదనే వాదనను తెరపైకి తీసుకొచ్చి .. సభ్యత్వం ఇవ్వకుండా మోకాలడ్డుతోంది డ్రాగన్ చైనా.












Click it and Unblock the Notifications