నో టాక్స్: మోడీ, షరీప్ కరచాలనం చేసుకున్నారు
ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండ్లో జరుగుతున్న సార్క్ శిఖరాగ్ర సదస్సులో బుధవారంనాడు ఎడమొహం పెడమొహంగా ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీప్ గురువారం కరచాలనం చేసుకున్నారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత వారిద్దరు కలుసుకోవడం ఇదే తొలిసారి. ఈ సమయంలో వారిద్దరు కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పిటిఐ వార్తా సంస్థతో చెప్పారు
ఖాట్మండుకు 20 కిలోమీటర్ల దూరంలో కావ్రే జిల్లాలో గల ధులిఖేల్లో ఏర్పాటు చేసిన అనధికార సమావేశంలో వారిద్దరు కలుసుకున్నారు. అనధికార ద్వైపాక్షిక, బహుపాక్షిక చర్చలకు ఈ సమావేశం ఏర్పటైంది. మోడీ, షరీఫ్ మధ్య అధికారికంగా ద్వైపాక్షిక చర్చలు జరగలేదని చెప్పారు.
బుధవారం జరిగిన సార్క్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాకిస్తాన్ ప్రధాని నవాబ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య మాటలు లేవు. మూడు గంటలకు పైగా జరిగిన కార్యక్రమంలో వారి మధ్య రెండు సీట్ల దూరమే ఉన్నప్పటికీ ఒకరి వైపు ఒకరు చూసుకోలేదు. ఒకరినొకరు పట్టించుకోలేదు.

నవాజ్ షరీఫ్ ప్రసంగం ముగించుకుని తన సీటు దగ్గరకు మోడీని దాటుకుని వెళ్లినప్పుడు కూడా ఇద్దరి నేతల చూపులు కలవలేదు. షరీఫ్ తన ప్రసంగం చేయడానికి కదిలిపోతుండగా అటువైపు కూడా చూడకుండా మోడీ బుక్లెట్ చూస్తూ కనిపించారు.
ప్రారంభోత్సవ కార్యక్రమం ముగిసిన తర్వాత దేశాధినేతలను హోల్డింగ్ రూంలో సమావేశానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే మోడీ, కొయిరాల చాలా సేపు వేదిక మీదనే ఇరువురు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఆ తర్వాత వీరివురు హోల్డింగ్ రూంలోకి వెళ్లారు. అక్కడ కూడా మోడీ, షరీఫ్ కలుసుకునే అవకాశం కలగలేదు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications