బలంగా ఢీకొని అల్జీరియా విమానం ముక్కలు ముక్కలు!
అల్జీర్స్: అత్యవసరంగా ల్యాండ్ అవుతుండగా ప్రమాదం బారినపడిన అల్జీరియా విమానం పైన దర్యాప్తు చేపట్టిన అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నిపుణులు ఓ అంచనాకు వచ్చారు. ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో రెండు రోజుల క్రితం జరిగిన అల్జీరియా విమాన ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న నిపుణులు... విమానం చాలా బలంగా నేలను ఢీకొట్టడంతోపాటు గాలిలోకి ఎగిరిపడి ఉంటుందని భావిస్తున్నారు.
అందుకే ముక్కలుముక్కలై అర కిలోమీటరు పరిధిలో శకలాలు చెల్లాచెదురుగా పడ్డాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా మృత్యువాతపడ్డారు. కొన్ని కుటుంబాలకు చెందిన వారంతా దుర్మరణం పాలయ్యారు.

ఫ్రాన్స్కు చెందిన ఒక కుటుంబంలోని 10 మంది మరణించినట్టు అధికారులు వెల్లడించారు. కాలిపోయి, ఛిద్రమైన మృతుల అవయవాలు మాత్రమే లభ్యంకావడంతో మృతదేహాలను గుర్తించడం కుదరడం లేదంటున్నారు.
ప్రతికూల వాతావరణం వల్లే పైలట్ విమానాన్ని దారి మళ్లించి ఉండవచ్చునని చెబుతున్నారు. విమానం అంత బలంగా నేలను ఎందుకు ఢీకొట్టిందో తేలాల్సి ఉందంటున్నారు. విమాన శకలాల నుంచి రెండో బ్లాక్బాక్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరణించిన వారిలో బర్కినా ఫాసో, లెబనాన్, అల్జీరియా, స్పెయిన్, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్లకు చెందినవారు ఉన్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications