రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి: ఐదో మహిళగా ఆర్నాల్డ్
స్టాక్హోమ్: రసాయన శాస్త్ర విభాగంలో ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం ఈ సంవత్సరం ముగ్గుర్ని వరించింది. అమెరికాకు చెందిన శాస్త్రవేత్త ఫ్రాన్సెస్ హెచ్ అర్నాల్డ్, పరిశోధకులు జార్జ్ పి స్మిత్, బ్రిటన్కు చెందిన పరిశోధకులు సర్ గ్రెగొరీ పి వింటర్ ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు.
ప్రొటీన్లను ఉపయోగించి జీవవైవిధ్య ఇంధనం నుంచి ఔషధాల తయారీ వరకు.. వివిధ రంగాల్లో వినూత్నమైన ఆవిష్కరణలకు గానూ వీరికి ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద అందే రూ. 7.35కోట్లలో సగం సొమ్మును ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్కు, మిగతా మొత్తాన్ని జార్జ్ స్మిత్, గ్రెగొరీ వింటర్కు పంచుతున్నట్లు ఎంపిక కమిటీ 'రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్' వెల్లడించింది.

కాగా, రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్న ఐదో మహిళగా ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్ ఘనత సాధించారు. అంతకుముందు మరియా స్కోలోడోవోస్కా క్యూరీ(1911), ఇరెనె జోలియట్ క్యూరీ(1935), డొరొతీ క్రోఫూట్ హాడ్కిన్(1964), అడా ఇ యోనత్(2009) రసాయన శాస్త్రంలో నోబెల్ అందుకున్నారు.
ఈ ఏడాది నోబెల్ అవార్డుల ప్రకటన సోమవారం నుంచి ప్రారంభమైంది. అక్టోబరు 5న నోబెల్ శాంతి బహుమతి, అక్టోబరు 8న ఆర్థిక రంగంలో నోబెల్ పురస్కారాల విజేతలను వెల్లడించనున్నారు. లైంగిక ఆరోపణల కారణంగా ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించడం లేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications